” ఆ విషయం నిరూపించలేకపోతే పద్మ శ్రీ వెనక్కి ఇచ్చేస్తా…”
బాలీవుడ్ హీరో సుశాంత్ మరణించి నెలరోజులు గడుస్తోన్నా..అతడి గురించి ఏదో ఒక న్యూస్ వార్తల్లో ట్రెండ్ అవుతూనే ఉంది.
బాలీవుడ్ హీరో సుశాంత్ మరణించి నెలరోజులు గడుస్తోన్నా..అతడి గురించి ఏదో ఒక న్యూస్ వార్తల్లో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా సుశాంత్ ఆత్మహత్యపై మరోసారి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సుశాంత్ మృతిపై గతంలోనే భగ్గుమన్న ఆమె బాలీవుడ్లో నెపోటిజం వల్లే అతడి మరణానికి కారణమని కామెంట్స్ చేసింది. అయితే తాజాగా తాను చేసిన విమర్శలని నిరూపించని పక్షంలో తనకిచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి ఇస్తానంటూ చెప్పుకొచ్చింది.
తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు కంగనా కొన్ని రోజుల క్రితం మనాలీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ దిగిన ఫోటోలని సామాజిక మధ్యామాల్లో షేర్ చేసింది. అయితే సుశాంత్ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు ముంబై పోలీసులు ఫ్రెండ్స్, సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల్ని విచారించారు. తాజాగా పోలీసులు కంగనాకి సైతం ఫోన్ చేశారు. అయితే తన స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకోవడానికి పోలీసుల ఇంకా ఎవర్నీ పంపలేదని కంగనా పేర్కొంఇ. తాను ఏదైన డైరెక్ట్గా మాట్లాడుతానని..పారిపోయే వ్యక్తిని కాదని తెలిపింది. తాను చేసిన విమర్శలని నిరూపించుకోలేని పక్షంలో పద్మశ్రీ వెనక్కి ఇవ్వడాననికి కూడా సిద్దం అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మరోవైపు సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తు జరపాలనే డిమాండ్ ఊపందుకుంటుంది.