చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జ్.. భయాందోళనలో జనం..!
గుజరాత్లో ఓ నదిపై ఉన్న వంతెన అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు ఆ బ్రిడ్జ్మీద ప్రయాణిస్తుండగానే ఒక్కసారిగా కూలింది. దీంతో ప్రయాణికుల భయబ్రాంతులకు గురయ్యారు. జూనాగఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మలంకా గ్రామానికి సమీపంలో ఉన్న ఈ బ్రిడ్జ్ సుమారు 60 అడుగుల ఎత్తులో ఉంది. వంతెన కూలడంతో దాదాపు నాలుగు కార్లు, పలు బైక్లు నదిలో పడిపోయాయి. అయితే నదిలో పడిపోయే ముందు అందులో ఉన్న ప్రయాణికులు వెంటనే బయటకు […]
గుజరాత్లో ఓ నదిపై ఉన్న వంతెన అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు ఆ బ్రిడ్జ్మీద ప్రయాణిస్తుండగానే ఒక్కసారిగా కూలింది. దీంతో ప్రయాణికుల భయబ్రాంతులకు గురయ్యారు. జూనాగఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మలంకా గ్రామానికి సమీపంలో ఉన్న ఈ బ్రిడ్జ్ సుమారు 60 అడుగుల ఎత్తులో ఉంది. వంతెన కూలడంతో దాదాపు నాలుగు కార్లు, పలు బైక్లు నదిలో పడిపోయాయి. అయితే నదిలో పడిపోయే ముందు అందులో ఉన్న ప్రయాణికులు వెంటనే బయటకు దూకేశారు. అయితే ఇందులో 14 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని స్థాని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతోనే ఈ వంతెన కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. వంతెన శిథిలాల కింద ఉన్న వాహనాలను రెస్యూ టీం బయటకు తీసింది.
As received as forward the bridge collapsed in Gujarat at village Malanaka, Taluka Mendarda Junagadh @nitin_gadkari @PMOIndia Sir people don’t want this type of quality work, please look in this regard. People of India have much expectations from your government. pic.twitter.com/rKvBzd8yxw
— yogesh joshi (@YlJoshi) October 6, 2019