వారం నుంచి నీరసంగా ఉన్నారు: జయప్రకాష్ రెడ్డి భార్య
ఉదయం 3.30గంటల సమయంలో నిద్రలేచి పిల్లలతో మాట్లాడాలి అన్నారని నటుడు జయప్రకాష్ రెడ్డి భార్య రాధ అన్నారు
Jayaprakash Reddy Death: ఉదయం 3.30గంటల సమయంలో నిద్రలేచి పిల్లలతో మాట్లాడాలి అన్నారని నటుడు జయప్రకాష్ రెడ్డి భార్య రాధ అన్నారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, కేవలం షుగర్ డౌన్ అయ్యి, గత వారం రోజులుగా నీరసంగా ఉన్నారని ఆమె తెలిపారు. 3.30గంటలకు లేచి, పిల్లలతో మాట్లాడాలన్నారు. ఇప్పుడు ఎందుకు..? ఆరు గంటలకు మాట్లాడుదాం. ఒకవేళ ఇప్పుడే మాట్లాడాలనిపిస్తే చెప్పండి ఫోన్ చేస్తా అని తాను తన భర్తతో చెప్పానని రాధా పేర్కొన్నారు. అయితే బాత్రూమ్కి వెళ్లి వచ్చి మాట్లాడతా అని.. అక్కడకు వెళ్లి, కిందపడిపోయారని రాధ తెలిపారు. వెంటనే పైకి వెళ్లి డాక్టర్ని తీసుకొచ్చానని, ఆ లోపే చనిపోయినట్లు డాక్టర్ అన్నారని ఆమె అన్నారు. ఇదంతా ఐదు నిమిషాల్లోనే జరిగిందని రాధ వివరించారు.
గతంలో తన భర్తకు స్టంట్లు వేశారని, వారం క్రితం ఆసుపత్రికి వెళ్లి జనరల్ చెకప్ చేయించుకుంటే, అంతా బావుందని వైద్యులు చెప్పినట్లు ఆమె అన్నారు. ఏడాదిన్నర క్రితమే గుంటూరుకు వచ్చామని, ఎవరైనా పాత్రలు చేయమని బలవంతం చేస్తేనే షూటింగ్కి వెళ్లేవారని, కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వాలని అనేవారని రాధ పేర్కొన్నారు. కాగా మంగళవారం ఉందయం గుండెపోటు రావడంతో నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. ఆయన మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాసేపటి క్రితం ఆయన అంత్యక్రియలు గుంటూరులో ముగిశాయి.
Read More:
కరోనా మరణాలకు చెక్ పెడుతోన్న ‘విటమిన్ డి’
కంగనా ఉందని మూవీ నుంచి తప్పుకున్నా: లెజండరీ సినిమాటోగ్రాఫర్