టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్న జవహర్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నేడు జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జవహర్ రెడ్డి తిరుపతికి చేరుకున్నారు
TTD New EO: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నేడు జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జవహర్ రెడ్డి తిరుపతికి చేరుకున్నారు. ఈ ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసి.. ఆ తరువాత అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు పయనం అయ్యారు. మధ్యాహ్నం 12 గంటల లోపు జవహర్ రెడ్డి ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా అలిపిరి వద్ద జవహర్ రెడ్డికి టీటీడీ పాలక మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు.
Read More:
కరోనా అప్డేట్స్: తెలంగాణలో 1,811 కొత్త కేసులు.. 9 మరణాలు
వర్మ ‘దిశ’ను ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన బాధితురాలి తండ్రి