Humanity : అనాధ ముస్లిం మహిళకు అంత్యక్రియలు నిర్వహించిన తాడేపల్లిగూడెం సీఐ
Tadepalligudem CI : అనాధ ముస్లిం మహిళ పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం టౌన్ ఇన్స్పెక్టర్..

Tadepalli Gudem CI
Tadepalligudem CI : అనాధ ముస్లిం మహిళ పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం టౌన్ ఇన్స్పెక్టర్. తాడేపల్లి గూడెం మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన షేక్ గౌస్ అనే 55 ఏళ్ల మహిళ తాడేపల్లి గూడెం ఏరియా ఆస్పత్రిలో కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మీద ఆధారపడిన ఒక అమ్మాయి మినహా ముందు వెనకా ఎవరూ లేని మృతురాలికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తాడేపల్లిగూడెం సీఐ ఆకుల రఘు.. బత్తిన గణేష్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.

Humanity
Follow Us