AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: వారికి ప్రతీ నెలా రూ.1800 పించన్.? వైరల్ ట్వీట్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి...

Fact Check: వారికి ప్రతీ నెలా రూ.1800 పించన్.? వైరల్ ట్వీట్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
Fact Check Central Governme
Ravi Kiran
|

Updated on: May 03, 2022 | 3:54 PM

Share

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఫేక్ న్యూస్ స్పీడ్‌గా విస్తరిస్తోంది. తాజాగా ప్రజలను మభ్యపెట్టేలా ఓ పుకారు నెట్టింట్లో తెగ షికారు చేస్తోంది. ”ప్రధాన మంత్రి మంధన్ యోజన కింద 18-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి రూ. 1800 పెన్షన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అందుకోసం ఈ లింక్‌ క్లిక్ చేయాలి” అని ఓ వార్త ప్రస్తుతం వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనితో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఆ ట్వీట్‌పై ఫ్యాక్ట్ చెక్ చేసింది. అది నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) తేల్చి చెప్పింది. ప్రధాన మంత్రి మంధన్ యోజన కింద 18-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి కేంద్రం ఎలాంటి పెన్షన్ ఇవ్వట్లేదని వెల్లడించింది. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేసింది.

నిజం: ప్రధాన మంత్రి మంధన్ యోజన కింద 18-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి రూ. 1800 పెన్షన్‌ను కేంద్రం ఇవ్వట్లేదు..

ప్రధానమంత్రి శ్రమయోగి మంధన్ యోజన అంటే ఏమిటి.?

ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన అనేది వృద్ధాప్యంలో ఉన్న అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రతను అందించే ప్రభుత్వ పథకం. ఈ పథకం అసంఘటిత రంగాలలో పని చేసేవారికి, పెన్షన్ లేదా PF వంటి సామాజిక భద్రత ప్రయోజనాలను పొందలేని వారి కోసం మాత్రమే. ఈ పథకం కూలీలు, వీధి వ్యాపారులు, కష్టపడి జీవనోపాధి పొందేవారికి పెన్షన్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ పధకంలో చేరేందుకు వయస్సు 18-40 మధ్య ఉండాలి, అయితే పెన్షన్ మాత్రం 60 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తుంది. నెలవారీ ఆదాయం రూ. 15,000 వరకు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకం ద్వారా నెలకు రూ. 3000 వరకు పించన్ లభిస్తుంది. ఇది పూర్తిగా స్వచ్ఛంద పెన్షన్ పథకం. పథకంలో చేరిన వ్యక్తి ఖాతాలోకి డబ్బును భారత ప్రభుత్వం జమ చేస్తుంది. ఖాతాదారుడికి 60 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత మాత్రమే పెన్షన్ వస్తుంది.