Heart Touching Story: 14 వారాలకే కడుపులో బిడ్డ మృతి.. పసికందు కోసం తల్లడిల్లిన మాతృహృదయం… చివరకు

ఓ మహిళకు.. ప్రెగ్నెంట్ అయిన ఆనందం ఎంతో కాలం నిలువలేదు. 14 వారాలకే కడుపులోనే బిడ్డ కన్నుమూసింది. దీంతో వైద్యులు ఆమె గర్భం నుంచి పిండాన్ని బయటకు తీశారు.

Heart Touching Story: 14 వారాలకే కడుపులో బిడ్డ మృతి.. పసికందు కోసం తల్లడిల్లిన మాతృహృదయం... చివరకు
Mother Love

Updated on: Apr 09, 2021 | 7:04 PM

ఓ మహిళకు.. ప్రెగ్నెంట్ అయిన ఆనందం ఎంతో కాలం నిలువలేదు. 14 వారాలకే కడుపులోనే బిడ్డ కన్నుమూసింది. దీంతో వైద్యులు ఆమె గర్భం నుంచి పిండాన్ని బయటకు తీశారు. మహిళ కోరడంతో.. సదరు పిండాన్ని ఆమెకే ఇచ్చేశారు. అయితే తన బుజ్జి ప్రతిరూపాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న ఆ మహిళ.. ఆ బిడ్డ జీవితాంతం తనతోనే ఉండాలని కోరుకుంది. కానీ అది అసాధ్యం. ఈ క్రమంలోనే ఆమెకు ఓ ఆలోచన తట్టింది. మొక్కలను పెంచే పూలకుండీలో ఆ పసిగుడ్డు మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. కన్నీరు పెట్టించే ఈ ఘటన అమెరికాలోని సిస్సోరీలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. సదరు మహిళ పేరు శర్రాన్ సుదేర్లాండ్. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ గుండె సంబంధిత సమస్యతో అకస్మాత్తుగా చనిపోయింది. దీంతో అబార్షన్ ద్వారా పిండాన్ని తొలగించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో పిండం రక్తపు ముద్దగా మారుతుంది. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో సర్జరీ ద్వారా ఆ బుజ్జి పిండాన్ని వైద్యులు బయటకు తీశారు. ఆశ్యర్యకరంగా 14 వారాలకే ఆ పిండానికి పూర్తిగా అవయవాలన్నీ తయారయ్యాయి. అనంతరం ఆ పిండాన్ని ఆమె ఇంటికి తీసుకెళ్లింది.

తొలుత ఆ మృతపిండాన్ని  సిలైన్ సీసాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టింది. అతికష్టం మీద వారం రోజులపాటు ఆ పిండాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన శర్రాన్.. చివరికి పూడ్చిపెట్టక తప్పలేదు. ఆ పసి పిండానికి గుర్తుగా పూల కుండీలో పూడ్చి పెట్టింది. తన బిడ్డను మొక్క రూపంలో చూసుకుంటూ మురిసిపోతుంది.

Also Read: వానరాలే వారి అస్త్రం.. కోతులతో మాయ చేసి లీలగా దోచేస్తారు.. జర భద్రం గురూ 

ఈ రాజు ఏడాదికి ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు.. ఇప్పటికి 15 మంది భార్యలు.. ఇంకా

 

Loading...
Unable to load recommendations.
Follow Us