తిన్న ప్లేట్లోనే చేయి కడుగుతున్నారా.? పండితులు ఏమంటున్నారంటే..
భోజనం చేసిన ప్లేట్లో చేయి కడగడం మనలో దాదాపు చాలా మంది చేస్తుంటారు. అయితే ఇలా చేయడం సరికాదని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతున్నారు. ఎంతో పవిత్రమంగా భావించే ఆహారంలోనే చేయి కడగడం పాపంతో సమానమని అంటున్నారు. అంతేకాదు అన్నంతో ఉన్న ప్లేట్ను ఒక చేత్తో పట్టుకోకూడదని..
అన్నం పరబ్రహ్మ స్వరూపంగా చెబుతుంటారు. అంతేనా కోటి విద్యలు కూటికొరకే అనే సామెత ఉండనే ఉంది. ఎంత పనిచేసినా చివరికి తిండి కోసమే అని అర్థం. అందుకే ఆహారాన్ని దైవంతో సమానంగా భావించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే మనకు తెలిసో తెలియకో ఆహారం విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటాం. అలాంటి తప్పుల్లో తిన్న ప్లేట్లోనే చేయి కడుక్కోవడం. ఇలా చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో పండుతుల మాటల్లోనే..
భోజనం చేసిన ప్లేట్లో చేయి కడగడం మనలో దాదాపు చాలా మంది చేస్తుంటారు. అయితే ఇలా చేయడం సరికాదని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతున్నారు. ఎంతో పవిత్రమంగా భావించే ఆహారంలోనే చేయి కడగడం పాపంతో సమానమని అంటున్నారు. అంతేకాదు అన్నంతో ఉన్న ప్లేట్ను ఒక చేత్తో పట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో బఫ్ విధానం అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇలాగే తింటున్నారు.
అంతేకాకుండా భోజనం చేసే సమయంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా తీసుకుంటున్న ఆహారంపైనే దృష్టిసారించాలని చెబుతున్నారు. కోపాలు, ఆవేశాలు లేకుండా ఆహారాన్ని సేవించాలని అంటున్నారు. ఇతరులను దూషిస్తూ, కోపాన్ని ప్రదర్శిస్తూ భోజనం చేయడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా బలహీనపడి, పేదరికం వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని వృథా చేయకూడదు. ఇలా చేసే వారికి ఆహారం కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..