
మనం తీసుకునే ఆహారం మన మెదడు పనితీరుకు చాలా ముఖ్యం. మనం తినేది మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. సరైన ఆహారం మెదడును చురుకుగా ఉంచుతుంది. మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆరోగ్యకరమైన మెదడుకు ఆరోగ్యకరమైన శరీరం అవసరం. సరైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడులో వాపు తగ్గుతుంది. ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మెదడులో ఉండే న్యూరోట్రాన్స్మిటర్లైన సెరోటోనిన్, డోపమైన్లను బ్యాలెన్స్గా ఉంచడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, జింక్, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు అవసరం.
మంచి ఆహారంతో పాటు.. ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగడం కూడా మెదడుకు చాలా అవసరం. మెదడులో 75 శాతం నీరు ఉంటుంది. తగినంత నీరు తాగకపోతే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, పుదీనా షర్బత్ వంటి డ్రింక్స్ శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. అలాగే పుచ్చకాయ, నారింజ, దోసకాయ వంటి నీరు ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడం మంచిది. రోజుకు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)