
మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది. చికెన్ కూర లేదా ఫ్రై ఎక్కువగా మిగిలిపోతే.. దానిని ఫ్రిజ్లో పెట్టి మరుసటి రోజు తింటారు. ఇలా చేయడం వల్ల ఆహారం వృథా కాకుండా ఉంటుంది అని అనుకుంటాం. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
చికెన్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. చికెన్ వండిన తర్వాత ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచినా లేదా ఫ్రిజ్లో పెట్టి మళ్లీ వేడి చేసినా అందులో బ్యాక్టీరియా చాలా వేగంగా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశం ఉంది. సాల్మొనెల్లా (Salmonella), ఇ.కోలై (E. Coli) వంటి బ్యాక్టీరియా చికెన్లో చాలా త్వరగా వ్యాపిస్తాయి.
ఈ సమస్యలు ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మరింత తీవ్రంగా మారవచ్చు.
చాలా మంది ఫ్రిజ్లో పెట్టాం కాబట్టి చికెన్ పాడవదు అని అనుకుంటారు. కానీ ఫ్రిజ్లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా పూర్తిగా చనిపోదు, కేవలం వాటి పెరుగుదల నెమ్మదిస్తుంది అంతే. ఆ ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి తిన్నా, బ్యాక్టీరియా నుండి వచ్చే విష పదార్థాలు అలాగే ఉండిపోతాయి. ఇవే ఫుడ్ పాయిజనింగ్కు ప్రధాన కారణం.
చికెన్ వండిన వెంటనే వేడి వేడిగా తింటేనే రుచిగా, తాజాగా ఉంటుంది. ఫ్రిజ్లో పెట్టి మరుసటి రోజు తింటే అది రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికీ హాని చేస్తుంది. కాబట్టి సౌకర్యం కంటే ఆరోగ్యం ముఖ్యం అని గుర్తుంచుకుని.. వండిన చికెన్ను వెంటనే తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.