
మధుమేహం లేదా అధిక రక్త చక్కెర అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి స్వీట్లు, కూల్ డ్రింక్స్. కానీ, మనకు తెలియకుండానే మన మెటబాలిక్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అసలు శత్రువు మరొకటి ఉంది. అదే మనం ప్రతిరోజూ టీతో కలిపి తినే ‘బిస్కెట్’. లండన్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సుమిత్ శర్మ తన తాజా పరిశోధనల ద్వారా ఈ షాకింగ్ నిజాలను వెల్లడించారు. బిస్కెట్లు ఎలా ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు దారితీస్తాయో, వాటి వల్ల కలిగే నష్టాలేంటో వివరంగా తెలుసుకుందాం.
సాధారణ బిస్కెట్లలో ఉండే పదార్థాలు మీ మెటబాలిజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
శరీరంలోని కణాలు ఇన్సులిన్ హార్మోన్కు సరిగ్గా స్పందించకపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల క్లోమం మరింత ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది.
టీతో రెండు బిస్కెట్లు తిన్న 20-30 నిమిషాల్లో రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఆ తర్వాత 60-90 నిమిషాలకు గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. దీనివల్ల మీకు మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ బిస్కెట్ల వైపు మొగ్గు చూపుతారు. ఇలా తెలియకుండానే మీరు రోజుకు 5-10 బిస్కెట్లు తినే ప్రమాదం ఉంది.
మధుమేహం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ప్రతిరోజూ మనం చేసే చిన్నపాటి పొరపాట్లే పెద్ద అనారోగ్యాలకు దారితీస్తాయి. టీతో బిస్కెట్లను పక్కన పెట్టి, ప్రోటీన్ రిచ్ ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా మీ మెటబాలిక్ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు.