ప్రస్తుతం అనారోగ్య సమస్యలున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి నిత్యం ఉద్యోగంలో ఒత్తిడి, ఇతర మానసిక టెన్షన్స్, ఆర్థికపరమైన ఇబ్బందులు తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు. అయితే ప్రస్తుత కాలంలో జీవన విధానంలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే జీవితం హాయిగా సాగిపోతుంటుంది. ముఖ్యంగా ఆహార నియమాలలో మార్పులు జరిగితే వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా బీపీ, షుగర్లు బారిన పడేవారు చాలా మందే ఉన్నారు. ఇంతకముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే గతంలో నిపుణులు హెచ్చరించారు. కానీ రోజులు పెరుగుతున్న కొద్ది ఈ సమస్యలు మరింతగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనలు, సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)