సహజంగానే కొబ్బరి నీరు తియ్యగా ఉంటాయి. దీంతో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అయితే.. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మధు మేహంతో బాధపడుతోన్న వారికి ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ను కంట్రోల్లో ఉంచడంలో కొబ్బరి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ఉండే ఫైబర్ ప్రోటీన్స్, ఆకలిని తగ్గిస్తాయి. వీటిలోని నేచురల్ ఎలక్ట్రోలైట్స్ మధుమేహులకు ఇన్స్టాంట్ శక్తినిస్తాయి. పొటాషియం కూడా మేలు చేస్తుంది.
కొబ్బరి నీళ్లతో డయాబెటిస్ రోగులకు మేలు జరిగినా. ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లను మాత్రం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో షుగర్ స్తాయిలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇది షుగర్ పేషెంట్స్కు ఇబ్బందిగా మారుతుంది. ఇక డయాబెటిస్ ఎక్కువ ఉన్న వాళ్లు మాత్రం పరిమిత మేర కొబ్బరి నీటిని తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
తలనొప్పికి సంబంధించిన చాలా సమస్యలు డీహైడ్రేషన్ కారణంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి ఎలక్ట్రోలైట్లను వెంటనే అందించవచ్చు, ఇది హైడ్రేషన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. కొబ్బరి నీరు పిల్లలు.. పసిపిల్లలను కూడా హైడ్రేటెడ్గా ఉంచుతుంది.
Coconut Water