
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) రిపోర్ట్ ప్రకారం.. ప్రతి ఏటా ఇండియాలో 28 వేల కంటే ఎక్కువ కొత్త బ్రెయిన్ ట్యూమర్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. 24 వేల కంటే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ క్యాన్సర్ వల్ల ప్రతి ఏటా 3 లక్షల కంటే ఎక్కువ కొత్త కేసులు, 2.5 లక్షలకు పైగా మరణాలు వస్తున్నాయి. భారత్లో కేసులు కూడా ఈ గ్లోబల్ ట్రెండ్కు అనుగుణంగానే ఉన్నాయి.
బ్రెయిన్ క్యాన్సర్ ఏ ఏజ్ గ్రూప్ వారికైనా రావచ్చు. కానీ ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారికి.. 15 ఏళ్ల లోపు పిల్లలకు వచ్చే రిస్క్ ఎక్కువ. పిల్లల్లో గ్లియోమాస్ అనే క్యాన్సర్ రకం ఎక్కువగా వస్తుంది.
అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. యూత్లో, మధ్య వయసు వారిలో కూడా బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరుగుతున్నాయి. ఒక స్టడీలో 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిలో చాలా కేసులు ఉన్నాయని తేలింది. 20 నుంచి 39 ఏళ్ల ఏజ్ గ్రూప్లో కూడా చాలా మందికి ఈ డిసీజ్ వచ్చింది. మహిళల్లో దీని శాతం కొంచెం ఎక్కువగా ఉంది.
ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య ఎక్కువగా లేకపోయినా.. యువతలో కూడా బ్రెయిన్ ట్యూమర్లు వస్తున్నాయని, మరణాల రేటు ఎక్కువగా ఉందని ఈ లెక్కలు చెబుతున్నాయి. దీనిపై పబ్లిక్కు ముందుగా అవగాహన కల్పించడం, డిసీజ్ను త్వరగా గుర్తించడం, మంచి మెడికల్ సర్వీసెస్ అందించడం చాలా అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)