ఎగ్జిట్‌ పోల్స్‌ హంగామా..కౌన్ బనేగా కింగ్!

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేటితో ముగిసింది. ఇక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ రిజల్ట్స్ తెలియాలంటే ఈనెల 23 వరకు వెయిట్ చేయాల్సిందే.  ఈ నేపథ్యంలో మరికాసేపట్లో  రిలీజ్ కాబోతోన్న ఎగ్జిట్‌ పోల్స్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది . మొత్తం 542 లోక్‌ సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రజల నాడి ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో […]

ఎగ్జిట్‌ పోల్స్‌ హంగామా..కౌన్ బనేగా కింగ్!
Follow us

|

Updated on: May 19, 2019 | 5:36 PM

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేటితో ముగిసింది. ఇక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ రిజల్ట్స్ తెలియాలంటే ఈనెల 23 వరకు వెయిట్ చేయాల్సిందే.  ఈ నేపథ్యంలో మరికాసేపట్లో  రిలీజ్ కాబోతోన్న ఎగ్జిట్‌ పోల్స్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది . మొత్తం 542 లోక్‌ సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రజల నాడి ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణల్ని ఆయా సర్వే సంస్థలు వెల్లడించనున్నాయి.

అయితే సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయకూడదని ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ టైమ్ తర్వాతనే పోల్స్ బయటకు రానున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం లగడపాటి సర్వే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.