Tollywood: గత జన్మలలో రుణం ఏమో.. తెలుగు ఫ్యాన్స్ గురించి తమిళ హీరో..

తమిళ హీరో తెలుగు ప్రేక్షకులపై తనకున్న అభిమానాన్ని, భాషతో అనుబంధాన్ని వివరించారు. తెలుగు ప్రజల ఆదరణ ఒక వరం అన్నారు. ఎలాంటి బేషజాలు లేకుండా తెలుగు ఆడియెన్స్ తనకు ఎక్కువ ప్రేమను పంచినట్లు తెలిపారు. ఇంతకీ ఆయన ఎవరు..? .. ..

Tollywood: గత జన్మలలో రుణం ఏమో.. తెలుగు ఫ్యాన్స్ గురించి తమిళ హీరో..
Telugu Audience

Updated on: Mar 29, 2026 | 3:50 PM

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రతారగా కొనసాగుతున్న కార్తీ, తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి మాట్లాడుతూ, అది తనకు అదృష్టమని, గత జన్మల రుణం కావచ్చునని కార్తీ అన్నారు. తెలుగు ప్రజలు తనకు అండగా నిలవడం, తన తప్పులను కూడా ఆదరించడం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, అందుకే తాను ధైర్యంగా తెలుగులో మాట్లాడగలుగుతున్నానని తెలిపారు. తెలుగు భాషను నేర్చుకోవడంలో తన పరిసరాలు ఎంతో సహాయపడ్డాయని వివరించారు. చెన్నైలోని టీ. నగర్‌లో తన ఇంటి పక్కన నూతన్ ప్రసాద్ వంటి తెలుగు ప్రముఖులు నివసించడం, వారిని చిన్నతనం నుంచి వింటూ పెరగడం, తెలుగు పాటలు వినడం వల్ల తెలుగు భాష సౌండింగ్ అంటే తనకి ఇష్టమని చెప్పారు. యుగానికి ఒక్కడు సినిమా మినహా తన సినిమాలన్నిటికీ తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం ద్వారా తెలుగు ప్రేక్షకుల మరింత చేరువ అవుతున్నానని తెలిపారు.

గ్రామీణ నేపథ్య చిత్రాలపై తనకున్న ఆసక్తిని కూడా కార్తీ పంచుకున్నారు. గ్రామీణ జీవనం, ప్రకృతితో మమేకమైన సాధారణ జీవితం అంటే తనకెంతో ఇష్టమని, రైతుల జీవనశైలి ఎంతో అందంగా ఉంటుందని తెలిపారు. ప్రకృతిలో ప్రతి చిన్న మార్పుకు వారు అర్థం కనుగొంటారని, ఫోన్‌లకు మాత్రమే అంకితమైన పట్టణ జీవితం కన్నా ఇది ఎంతో భిన్నమని అన్నారు. పొంగల్ వంటి పండుగలకు తన కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వెళ్లడం, సంప్రదాయాలు, మూలాలను కాపాడుకోవడం తనకు చాలా ముఖ్యమని చెప్పారు. సుమారు 3000-4000 సంవత్సరాల నాటి తమ సంస్కృతిని, పూర్వీకుల జీవనాన్ని మరచిపోకూడదని, ఇది మనకు ఒక గొప్ప మూలం అని నొక్కి చెప్పారు. ఈ విలువలను తన తండ్రి శివకుమార్ నేర్పినప్పటికీ, వాటిపై తనకు సహజంగానే ఆసక్తి ఉందని కార్తీ చెప్పారు.

నటుడు కార్తి తెలుగు అభిమానుల పట్ల తనకున్న ప్రత్యేక అభిమానం గురించి మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులను తాను ఎందుకు ఎంతగానో ఇష్టపడతారో వివరించారు. ఒక సినిమా విజయవంతమైతే, తెలుగు అభిమానులు హీరో, హీరోయిన్, సంగీత దర్శకులతో పాటు దర్శకులను కూడా గొప్పగా సెలబ్రేట్ చేయడం తనకు ఆశ్చర్యంగా, కొత్తగా అనిపించిందని కార్తి తెలిపారు. తమిళంలో ప్రధానంగా హీరోలను అభిమానులు ఆదరిస్తారని, కానీ తెలుగునాట దర్శకులకు కూడా అంతే గౌరవం, గుర్తింపు ఇవ్వడం తనకు బాగా నచ్చిందని కార్తి అన్నారు. దర్శకుల కష్టానికి, సృష్టికి తగిన గుర్తింపు లభించడం గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. హీరోలు మూడు, నాలుగు నెలలు సినిమాలో భాగమైతే, దర్శకులు ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలు సినిమా కోసం కృషి చేస్తారని కార్తి గుర్తుచేశారు. ఈ సంస్కృతి తమిళ సినీ పరిశ్రమలోకి కూడా రావాలని తాను కోరుకుంటున్నానని ఆయన వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులకు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉందన్నాకు కార్తీ. వారి విస్తృతమైన ఆదరణ, వైవిధ్యమైన చిత్రాలను స్వీకరించే తీరు ప్రశంసనీయం అని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు బాహుబలి లాంటి భారీ యాక్షన్ చిత్రాల నుండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సాగర సంగమం వంటి సున్నితమైన, క్లాసిక్ చిత్రాల వరకు అన్నింటినీ సమానంగా ఆదరిస్తారు. ఇది వారి సినీ అభిరుచికి నిదర్శనం అని కార్తీ చెప్పుకొచ్చారు.

Also Read: ఆ దర్శకుడు అందరి ముందు పైట విప్పమన్నారు.. నేను వెంటనే… 

Loading...
Unable to load recommendations.
Follow Us