
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులచేత నవ్వులు పూయించారు. అలాగే వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. తొలి షో నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మూవీ టీమ్ మొత్తం ఆనందంలో తేలిపోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా వెంకటేష్ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఐశ్వర్య రాజేష్ కూడా తన నటనతో అలరించింది. అనిల్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ రిలీజ్ కన్ఫార్మ్ అయ్యింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రైట్స్ ను జీ 5 కొనుగోలు చేసిందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ సినిమా నైజంలో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నైజాంలో దాదాపు 40 కోట్ల లాభం వచ్చిందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి