Sai Pallavi : ఆ రెండు సినిమాలపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నదంటే..

|

Jul 16, 2022 | 11:03 AM

ఇటీవలే డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించారు.

Sai Pallavi : ఆ రెండు సినిమాలపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నదంటే..
Sai Pallavi
Follow us on

గార్గి సినిమాతో మరోసారి నటవిశ్వరూపం చూపించింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. జూలై 15న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. తప్పుడు కేసులో అరెస్ట్ అయిన తండ్రిని రక్షించుకోవడానికి.. అతడిని నిర్దోషిగా విడిపించుకోవడానికి పోరాటం చేసే ఓ కూతురి పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయింది. ఇందులో ఆమె నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. గార్గి సినిమా విజయవంతంగా దూసుకుపోతున్న క్రమంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఆసక్తికర కామెంట్ చేసింది.

సాయి పల్లవి మాట్లాడుతూ.. ” కొన్నిసార్లు పలు సినిమాల్లోని పాత్రలలో నన్ను నేను ఊహించుకుంటాను. ఈ పాత్ర నేను చేయాలి అనుకుంటున్నాను. అలా పద్మవాత్, బాజీరావ్ మస్తానీ చిత్రాల్లోని కథానాయిక పాత్రలలో నటించాలని ఉంటుంది. శ్యామ్ సింఘరాయ్ సినిమాలోని దేవదాసి పాత్ర చేసినప్పుడు సంతృప్తి చెందాను. అలాగే ఇంకా ఎక్కువకాలం పూర్తిస్థాయి పాత్రలు చేస్తే బాగుంటుంది. ” అంటూ చెప్పుకొచ్చింది.

ఇటీవలే డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 1990లో జరిగిన యాదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమాలో రానా.. నక్సలైట్ రవన్నగా.. సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించింది.