సాగర తీరాన..సతీ సమేతంగా

|

Oct 17, 2020 | 6:01 PM

లాక్‌డౌన్ సమయంలో సింపుల్‌గా రానా-మిహీకాల పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. కాగా మ్యారేజ్ అనంతరం భర్తతో కలిసి దిగిన  తొలి ఫోటోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మిహీకా.

సాగర తీరాన..సతీ సమేతంగా
Follow us on

లాక్‌డౌన్ సమయంలో సింపుల్‌గా రానా-మిహీకాల పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. కాగా మ్యారేజ్ అనంతరం భర్తతో కలిసి దిగిన  తొలి ఫోటోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మిహీకా. ఇది పెళ్లి అనంతరం హనీమూన్ వెళ్లినప్పుటి ఫోటోగా తెలుస్తోంది.  వీరిద్దరికి ఈ ఏడాది ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే. శనివారం మిహీకా సన్ బాత్ పిక్చర్‌ను పోస్ట్ చేసారు. స్లీవ్స్ టీ-షర్టుతో రానా ఉండగా… మిహీక పూల ప్రింట్ టాప్‌తో చాలా అందంగా కనిపిస్తోంది.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. క్యూట్, ఫేవరెట్ కపుల్ అంటూ ఫ్యాన్స్ సదరు ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు.  మరికొందరు ఈ పిక్ ఏ లొకేషన్‌లో తీశారో సెర్చ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

 

( రచ్చ కాంబినేషన్..పూరీతో యశ్ ! )