
ప్రపంచ సినిమా వేదికపై తెలుగు జెండాను ఎగురవేసిన ఆ దర్శకుడు అంటే అందరికీ ఎంతో గౌరవం. ఆయన సినిమాలో ఒక్క ఫ్రేమ్లో కనిపించినా చాలు అని స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తుంటారు. కానీ, అదే దర్శకుడిపై ఒకానొక సమయంలో ఆ స్టార్ హీరోకు విపరీతమైన కోపం వచ్చిందట. ఏకంగా పీకల దాకా విసుగు వచ్చి, ఇక నా వల్ల కాదు అనే స్థాయికి వెళ్ళిపోయారట మెగా పవర్ స్టార్ రాంచరణ్. ఆస్కార్ను ముద్దాడిన ఆ సినిమా సెట్స్లో అసలేం జరిగింది? ఆ దర్శకుడు చేసిన పనేంటి? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిని అందరూ ముద్దుగా ‘జక్కన్న’ అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఆయన ఒక శిల్పిలా ప్రతి సన్నివేశాన్ని చెక్కుతారు. తనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు నటీనటులను అస్సలు వదలరు. ఈ క్రమంలోనే ‘RRR’ షూటింగ్ సమయంలో రాం చరణ్కు రాజమౌళి మీద చాలా కోపం వచ్చిందట. షూటింగ్ మొదలైన కొత్తలో కాకుండా, దాదాపు రెండు మూడేళ్ల పాటు సాగిన ఆ ప్రయాణంలో ఒకానొక దశలో చరణ్ చాలా అసహనానికి గురయ్యారట.
ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు రాజమౌళి పర్ఫెక్షన్ కోసం చరణ్తో పదే పదే రీటేకులు చేయించారట. ఎండలో, దుమ్ములో గంటల తరబడి కష్టపడుతున్నా రాజమౌళి మాత్రం “ఇంకొకసారి.. వన్ మోర్” అంటూనే ఉండటంతో చరణ్కు చిరాకు వచ్చిందట. ఒకానొక టైమ్లో తన కోపాన్ని ఆపుకోలేక రాజమౌళి వైపు సీరియస్గా చూశారట. అప్పట్లో ఈ విషయం యూనిట్ సభ్యుల మధ్య కూడా పెద్ద చర్చగా మారింది. అయితే రాజమౌళి మాత్రం ఏమీ తెలియనట్టు నవ్వుతూ తన పని తాను చేసుకుపోయేవారట.
Rajamouli N Charan
కేవలం రాం చరణ్ మాత్రమే కాదు, ఎన్టీఆర్ కూడా రాజమౌళి పెట్టే టార్చర్ గురించి చాలా ఇంటర్వ్యూలలో సరదాగా చెప్పారు. రాజమౌళికి కోపం వస్తే చేతిలో ఉన్న మైక్ విసిరికొడతారని, ఆ సమయంలో ఆయన దగ్గరకు వెళ్లాలంటేనే భయమని చరణ్ ఒకసారి గుర్తుచేసుకున్నారు. కానీ, ఆ కోపం.. ఆ పర్ఫెక్షన్ వల్లే ‘నాటు నాటు’ వంటి పాటలు, అల్లూరి సీతారామరాజు వంటి పవర్ఫుల్ పాత్రలు సాధ్యమయ్యాయని చరణ్ గర్వంగా చెబుతుంటారు.
మగధీర సినిమాతో మొదలైన వీరిద్దరి బాండింగ్ ఆర్ఆర్ఆర్ తో మరింత బలపడింది. రాజమౌళికి చరణ్ ఎంత క్లోజ్ అంటే, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేరుగా వెళ్ళి అడిగేంత చొరవ ఉంది. అందుకే ఆ కోపం కూడా కేవలం ఆ క్షణానికి మాత్రమే పరిమితమని, అది సినిమాపై ఉన్న ప్రేమ వల్లే వచ్చిందని ఇద్దరూ అంగీకరిస్తారు.