AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కెమెరామెన్ నీ ఫోకస్ ఎక్కడ ఉంది ?.. ఇంతందాన్ని గుర్తించలేదేంటీ ?.. వీడియో వైరల్..

ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఓ వీడియో. క్రికెట్ స్టేడియంలో కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ పెట్టాడంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు నెటిజన్స్. అసలేమైంది.. ఇంత అందాన్ని కెమెరామెన్ ఎలా మిస్సయ్యాడంటూ ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందామా. ఇటీవల చెన్నైలోని చెపాక్ మైదానంలో చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన సంగతి తెలిసిందే.

Tollywood: కెమెరామెన్ నీ ఫోకస్ ఎక్కడ ఉంది ?.. ఇంతందాన్ని గుర్తించలేదేంటీ ?.. వీడియో వైరల్..
Actress
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2024 | 6:58 AM

Share

ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో బుధవారం సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ముంబై జట్టుపై ఏకంగా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది హైదరాబాద్ జట్టు. ఇక ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో రాజస్థాన్ రాయల్స్ సమరానికి సిద్ధమైంది. ఐపీఎల్ తొమ్మిదో మ్యాచ్‏లో జైపూర్‏లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఓ వీడియో. క్రికెట్ స్టేడియంలో కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ పెట్టాడంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు నెటిజన్స్. అసలేమైంది.. ఇంత అందాన్ని కెమెరామెన్ ఎలా మిస్సయ్యాడంటూ ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందామా. ఇటీవల చెన్నైలోని చెపాక్ మైదానంలో చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోరులో 63 పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ చెన్నై ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సందడి చేసింది.

చెన్నైలోని చెపాక్ స్టేడియంలోని స్టాండ్స్ లో వరలక్ష్మి నిలబడి మ్యాచ్ ను ఎంజాయ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ కు మద్దతు ఇస్తున్నట్లుగా పసుపు రంగు షర్ట్ ధరించి కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ మ్యాచ్ లో కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ పెట్టారు. ఈ అందాన్ని గుర్తించడం ఎలా మర్చిపోయారు ?. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్‏గా తెరంగేట్రం చేసి.. ఆ తర్వాత విలనిజం వైపు అడుగులు వేసింది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ నటిగా దూసుకుపోతుంది. పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో అలరించింది. ఇందులో తేజా సజ్జాకు అక్కా పాత్రలో తనదైన నటనతో మెప్పించింది. ఇక ఇటీవలే తన స్నేహితుడితో నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చింది. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయి సచ్ దేవ్ ను త్వరలోనే పెళ్లి చేసుకోనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.