సత్యదేవ్తో పోటీకి సిద్ధంమవుతున్న నేచురల్ స్టార్.. టక్ జగదీష్ వర్సెస్ తిమ్మరుసు
కరోనా కారణంగా రూటు మార్చుకుంటారని అనుకున్న నాని టక్ వేసుకుని మరీ.. బ్యాక్ టూ థియేటర్స్ అని అంటున్నారు. పోటీకి ఎవరొచ్చినా తగ్గేది లేదంటూ..
కరోనా కారణంగా రూటు మార్చుకుంటారని అనుకున్న నాని టక్ వేసుకుని మరీ.. బ్యాక్ టూ థియేటర్స్ అని అంటున్నారు. పోటీకి ఎవరొచ్చినా తగ్గేది లేదంటూ పుష్పరాజ్ డైలాగుని కాస్త గట్టిగా చెబుతున్నారు. బాక్సాపీస్ పోరుకి ఎవరొచ్చినా మేం ఆగేది లేదంటూ.. ఓ వెర్సటైల్ అండ్ అప్కమింగ్ హీరోకు పోటీనిస్తున్నారు.. మన నేచురల్ స్టార్. సెకండ్ వేవ్ కారణంగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిన థియేటర్లలోకి.. ఫస్ట్ తానే వచ్చేస్తానంటున్నారు నాని.. ఫస్ట్ వేవ్ అయిపోగానే థియేటర్లలో సందడి చేసిన “సోలో బ్రతుకే సో బెటర్” సాయి ధరమ్ తేజ్, “క్రాక్” రవితేజ లాగే.. తాను కూడా ముందెళ్లి కలెక్షన్ల వర్షం క్రియేట్ చేయాలని అనుకుంటున్నారట. అందులో భాగంగానే జూలై 30 న థియేటర్లలోకి రావడానికి మూహూర్తం పెట్టాశారట నాని అండ్ టీం. అయితే అదే రోజు జూలై 30 న వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ “తిమ్మరుసు” తో థియేటర్లలోకి వచ్చేస్తున్నారు. ఎప్పటి నుంచో రిలీజ్ కాకుండా డిజిటిల్ బక్స్ల్లోనే ఉన్న ఈ సినిమాను థియేటర్లు ఓపెన్ అవగానే ముందు వరుసలో పెట్టాలనుకున్నారట సత్యదేవ్ అండ్ టీం. అందులో భాగంగానే ఈ సినిమాను రిలీజ్ డేట్ను అనౌన్స చేసి పబ్లిసిటీకి పూనుకున్నారు.
అయితే నివురుగప్పిన నిప్పులా కరోనా ఉన్న ఈ సమయంలో… థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందంటూ వార్తలస్తున్న నేపథ్యంలో.. జనాలు సినిమా చూసేందుకు థియేటర్లలోకి వస్తారా..? అన్న సంశయంలో.. నాని, సత్యదేవ్లు పోటా పోటీగా సినిమాను రిలీజ్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక వేళ సినిమా బాగుండి సినీ అభిమానులు థియేటర్లలోకి వచ్చినా… ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటే ఎక్కువ కలెక్షలు రాబట్టే ఛాన్స్ ఉందని.. ఫిల్మ్ విశ్లేషకులంటున్నారు. ఇక బిజినెస్ పరంగా చూస్తే.. నాని.. సత్యదేవ్ని దాటేసే అవకాశాలున్నాయని.. అందుకే ఈ రెండు సినిమాలు వారం తేడాతో రిలీజ్ అయితే…వీరిద్దరికీ లాభం అంటున్నారు టాలీ విశ్లేషకులు.. మరి వీరి సూచనపై సినీ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి!
మరిన్ని ఇక్కడ చదవండి :