శ్రీలంకలో మ‌ణిర‌త్నం కొత్త సినిమా షూటింగ్‌ !

|

Sep 04, 2020 | 5:50 PM

మ‌ణిరత్నాన్ని దర్శ‌కుడు అన‌డం కంటే మాంత్రికుడు అన‌డం బెట‌రేమో. వెండితెరపై ఆయ‌న చేసే అద్బుతాలు అలానే ఉంటాయి మ‌రి.

శ్రీలంకలో మ‌ణిర‌త్నం కొత్త సినిమా షూటింగ్‌ !
Follow us on

మ‌ణిరత్నాన్ని దర్శ‌కుడు అన‌డం కంటే మాంత్రికుడు అన‌డం బెట‌రేమో. వెండితెరపై ఆయ‌న చేసే అద్బుతాలు అలానే ఉంటాయి మ‌రి. ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతూ, కొత్త నీరును వంట బ‌ట్టించుకుంటూ క్లాసిక్స్‌ను చిత్ర పరిశ్ర‌మ‌కు అందిస్తారు ఈ సీనియ‌ర్ డైరెక్ట‌ర్.

ప్రస్తుతం ఆయ‌న‌ ‘పొన్నియన్‌ సెల్వన్ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్‌ థాయ్‌ల్యాండ్‌లో షూట్ చేశారు. అనంతరం కోవిడ్ ఎఫెక్ట్‌తో షూటింగ్‌ వాయిదా పడింది. ఐదు నెలల తర్వాత తిరిగి సినిమా షూటింగ్ రీ-స్టార్ట్ చేసేందుకు మూవీ యూనిట్ రెడీ అయింది. కొన్ని సీన్ల‌ను అడవుల్లో చిత్రీకరించాల్సి ఉన్నందున శ్రీలంకలో షూటింగ్ చేయాలని భావిస్తున్నారు. నెలపాటు సాగే ఈ షెడ్యూల్ కోసం సెప్టెంబర్‌ 20న ఆ దేశానికి వెళ్లనున్నార‌ని స‌మాచారం.

మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమాలో విక్రమ్‌, కార్తి, విక్రమ్‌ ప్రభు, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, త్రిష, అదితీరావు హైదరి ఐశ్యర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, శరత్‌ కుమార్‌, తదితరులు నటిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు న‌టించ‌నున్నారు.

Also Read :

మరో ఆశాకిరణం! కరోనాను ఎదుర్కొనే కొత్త వ్యాక్సిన్ !

కేజీ చేప‌లు రూ.10 : అయినా కొనుగోలు చేయ‌ని ప్ర‌జ‌లు !