Tollywood: చేసినవి రెండు సినిమాలే.. రెండూ డిజాస్టర్లు.. ఈ బ్యాడ్ లక్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చి కొద్ది సంవత్సరాలే అయింది. తెలుగులో రెండు సినిమాలు.. హిందీలో ఒక్క సినిమానే చేసింది. ఇదిలా ఉంటే.. ఆమె తెలుగులో చేసిన రెండు సినిమాలూ డిజాస్టర్లు. ఇప్పుడు సినీ ఆఫర్లే లేవు. మరి ఆమె ఎవరు.? ఏయే హీరోల సరసన నటించిందో ఇప్పుడు తెలుసుకుందామా..

Tollywood: చేసినవి రెండు సినిమాలే.. రెండూ డిజాస్టర్లు.. ఈ బ్యాడ్ లక్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood

Updated on: Apr 02, 2025 | 12:27 PM

అందం, అభినయం ఉంటే సరిపోదు.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే.. ఆ రెండింటితో పాటు కూసింత అదృష్టం కూడా తోడవ్వాలి. కొందరు హీరోయిన్లు చేసిన మొదటి సినిమాకే ఓవర్‌నైట్ స్టార్ స్టేటస్ సంపాదిస్తే.. మరికొందరు ఎన్ని సినిమాలు చేసినా కూడా.. స్టార్ హీరోయిన్ కాలేకపోతున్నారు. ఈ కోవలోకి వచ్చే భామలు కొందరు ఉన్నారు. ఇప్పుడు మేము చెప్పబోయే హీరోయిన్ కూడా ఆ కోవకు చెందిన బ్యూటీనే. ఈమె తెలుగులో చేసింది కేవలం రెండు సినిమాలే.. అయితే అవి రెండూ కూడా పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. తెలుగులో రవితేజ లాంటి స్టార్ హీరో సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. హిందీ వెబ్‌సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు.. అటు బాలీవుడ్‌లోనూ సరైన అవకాశాలు దక్కలేదు. బీ-టౌన్‌లోనూ ఈమె కేవలం ఒక్క సినిమాలోనే నటించింది. ఆమె ఎవరని అనుకుంటున్నారా.? మరెవరో కాదు హీరోయిన్ గాయత్రీ భరద్వాజ్.

2022లో ఇట్టు సే బాత్ అనే హిందీ చిత్రంలో నటించింది గాయత్రీ భరద్వాజ్. అయితే అంతకముందే దిన్‌దొర, ఇష్క్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు వెబ్‌ సిరీస్‌లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది గాయత్రీ భరద్వాజ్. ఇక 2023లో రవితేజ సరసన ‘టైగర్ నాగేశ్వరరావు’.. అలాగే 2024లో అల్లు శిరీష్ సరసన ‘బడ్డీ’ అనే రెండు తెలుగు సినిమాల్లో నటించింది గాయత్రీ. అయితే ఇవి రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి.

మరోవైపు అమ్మడు ‘హైవే లవ్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ సిరీస్‌లో ఇనాయ అనే రోల్‌లో తన అందంతో పాటు నటనతోనూ మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతుల్లో ఎలాంటి సినిమా ఆఫర్స్ లేకపోగా.. సోషల్ మీడియాలో మాత్రం ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది ఈ భామ. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.