Tollywood: ఒక్క హీరో.. అతని సినిమాలపై 2500 కోట్ల పెట్టుబడులు.. ఇంత దమ్మున్న స్టార్ ఇంకెవ్వరు

|

Jan 19, 2023 | 6:28 PM

ఒకటి రెండు కాదు.. ఈ హీరోపై ఏకంగా రెండున్నర వేల కోట్ల బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. మరి ఏంటా సినిమాలు.. అవెప్పుడు విడుదల కానున్నాయో తెలుసుకుందాం పదండి. 

Tollywood:  ఒక్క హీరో.. అతని సినిమాలపై 2500 కోట్ల పెట్టుబడులు.. ఇంత దమ్మున్న స్టార్ ఇంకెవ్వరు
Tollywood Hero
Follow us on

ఒక్క హీరో.. 2500 కోట్ల పెట్టుబడులు.. ఆ హీరో ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడెప్పుడో 17 ఏళ్ళ కింద ఛత్రపతి సినిమాలో ఆడి బాడీ బాక్సాఫీస్ అంటూ ప్రభాస్ గురించి ఓ డైలాగ్ రాయించారు రాజమౌళి. దాన్నిప్పుడు నిజం చేసి చూపిస్తున్నారు రెబల్ స్టార్. ఒకటి రెండు కాదు ఈయన మీద ఏకంగా రెండున్నర వేల కోట్ల బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. మరి ఏంటా సినిమాలు.. అవెప్పుడు విడుదల కానున్నాయో తెలుసుకుందాం పదండి.  తెలుగు ఇండస్ట్రీలో కాదు.. ఇండియన్ సినిమాలోనే మోస్ట్ బిజియెస్ట్ హీరో ప్రభాస్. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా.. ఇదే నిజం. ఎందుకంటే ప్రభాస్ చేతిలో ఒక్కటి రెండు కాదు.. ఏకంగా 8 సినిమాలున్నాయి. పైగా అందులో చర్చల దశలో ఉన్నవి కాదు.. కన్పర్మేషన్ వచ్చినవి. నిర్మాతలే ఈ అన్ని సినిమాలను ఖరారు చేసారు. అందులో ఏదెప్పుడు వస్తుందో ప్రభాస్‌కు కూడా క్లారిటీ లేదు.

ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటి షూటింగ్ సైమంటేనియస్‌గా చేస్తున్నారు రెబల్ స్టార్. ఓ వారం ప్రశాంత్ నీల్ సినిమాకు డేట్స్ ఇస్తే.. మరోవారం నాగ్ అశ్విన్‌కే డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటే మారుతి ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు ప్రభాస్. ఈ మూడు సినిమాల బడ్జెట్ అక్షరాలా 800 కోట్లు. అందులో ప్రాజెక్ట్ కే సింహభాగం తీసుకుంటుంది. ప్రభాస్‌తో సరికొత్త సైన్స్ ఫిక్షన్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు నాగ్ అశ్విన్. దీనికోసం నిర్మాత అశ్వినీదత్ 400 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది ఈ చిత్రంలో. 2024లో ప్రాజెక్ట్ కే విడుదల కానుంది. అలాగే సలార్ మాస్ సినిమా మాదిరే కనిపిస్తున్నా.. దీనికోసం 300 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. ఇక మారుతి సినిమా 150 కోట్లకు పైగా బడ్జెట్‌తో వస్తుంది.

ఇవన్నీ సెట్స్‌పై ఉన్న సినిమాలైతే.. ఆదిపురుష్ షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. దీనికోసం 300 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు పెట్టామని తెలిపారు నిర్మాత భూషణ్ కుమార్. విడుదలకు 150 డేస్ టూ గో అంటూ ప్రమోషన్ మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. జూన్‌లో ఆదిపురుష్ విడుదల కానుంది. ఇక సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సైతం 300 కోట్లకు పైగానే బడ్జెట్‌తో రాబోతుంది. దీన్ని కూడా టి సిరీష్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇన్ని సినిమాలు లైన్‌లో ఉండగానే.. మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్, సిద్ధార్ధ్ ఆనంద్ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించారు. ఇందులో హృతిక్ రోషన్ కూడా నటించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా దిల్ రాజు సైతం ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో రావణం అనే సినిమా ఖరారు చేసారు. వీటి బడ్జెట్ 600 కోట్లకు పైగానే ఉంది. ఇలా ప్రభాస్ కమిటైన సినిమాల బడ్జెట్ లెక్కేస్తే దాదాపు 2500 కోట్లకు పైగానే ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి