Devi Prasad: ధర్మవరపు సుబ్రహ్మణ్యం నాతో చెప్పిన అఖరి మాటలు వింటే కన్నీళ్లు వస్తాయి.. నటుడు దేవీ ప్రసాద్..

దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్ ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధాన్ని, సినిమా అనుభవాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన తన దర్శకత్వంలో వచ్చిన ఆడుతూ పాడుతూ సినిమా విజయగాథను, కామెడీకి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. కామెడీ రాయడం, డైరెక్ట్ చేయడం ఎంత కష్టమో దేవి ప్రసాద్ చెప్పారు.

Devi Prasad: ధర్మవరపు సుబ్రహ్మణ్యం నాతో చెప్పిన అఖరి మాటలు వింటే కన్నీళ్లు వస్తాయి.. నటుడు దేవీ ప్రసాద్..
Devi Prasad

Updated on: Mar 29, 2026 | 2:39 PM

ప్రముఖ దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్ ఇటీవలి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో దివంగత హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితో తన అనుబంధం, సినీ పరిశ్రమ అనుభవాలు, హాస్యానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. తన మొదటి దర్శకత్వ చిత్రం ఆడుతూ పాడుతూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిందని, శ్రీకాంత్ కెరీర్‌లో అది ఒక మలుపు అని ఆయన గుర్తు చేసుకున్నారు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా 100 రోజులు ఆడిందని, చాలామంది ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారని భావించారని దేవి ప్రసాద్ తెలిపారు. హాస్యం పట్ల తనకు చిన్నప్పటినుంచి ఎంతో ఆసక్తి ఉందని, అన్ని రకాల సినిమాలు తీయాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆడుతూ పాడుతూ విజయం తర్వాత హాస్య చిత్రాల డిమాండ్ పెరిగిందని దేవి ప్రసాద్ వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి పూర్తి స్థాయి షూటింగ్ తన దర్శకత్వంలో వచ్చిన కెవ్వు కేక సినిమానే అని దేవి ప్రసాద్ అన్నారు. చివరి రోజు షూటింగ్ సందర్భంగా ఉదయం 6 గంటలకు ధర్మవరపు తనకు ఫోన్ చేసి కడుపు నొప్పితో యశోద హాస్పిటల్‌లో చేరినట్లు, ఆలస్యంగా వస్తానని చెప్పినట్లు వివరించారు. ఆ రోజు షూటింగ్ రద్దు చేయగా, ఆయన నేరుగా హాస్పిటల్‌లోనే ఉండిపోయారు. కొద్ది రోజుల తర్వాత ధర్మవరపు తిరిగి ఫోన్ చేసి, తన ఆరోగ్యం సరిగా లేదని, పూర్తి పాత్రను చేయడానికి నాలుగైదు నెలలు పడుతుందని, కాబట్టి ఆ పాత్రకు వేరే నటుడిని తీసుకోవాలని సూచించారు. దీంతో ఆ పాత్రలో కృష్ణ భగవాన్‌ను తీసుకుని ఐదు రోజుల పనిని రెండున్నర రోజుల్లో పూర్తి చేసి, రీ-షూట్ చేశామని దేవి ప్రసాద్ చెప్పారు. ధర్మవరపు అకాల మరణం తెలుగు సినిమాకు తీరని లోటని ఆయన అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..

గతంలో ధర్మవరపు, ఎంఎస్ నారాయణ, ఏవీఎస్, జయప్రకాశ్ రెడ్డి, వేణు మాధవ్ వంటి హాస్యనటులను దృష్టిలో పెట్టుకుని రచయితలు సన్నివేశాలు రాసేవారని, వారు వాటిని స్పాట్‌లో అద్భుతంగా మెరుగుపరిచేవారని గుర్తు చేసుకున్నారు. అలాంటి హాస్యనటుల టైమింగ్ అసాధారణమని, సెట్‌లో వారి నటన ఎంతో సరదాగా ఉండేదని తెలిపారు. ప్రస్తుత తరంలో యువ హాస్యనటులు ఉన్నప్పటికీ, ధర్మవరపు, ఎంఎస్ నారాయణ వంటి సీనియర్ పాత్రలు పోషించగల మధ్య వయస్కులైన హాస్యనటుల కొరత ఉందని దేవి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Loading...
Unable to load recommendations.
Follow Us