ప్రముఖ నటి, తెలుగు బిగ్బాస్ 3 ఫేమ పునర్నవి భూపాలం తన అభిమానులను ఆర్చర్యపరిచారు. తన తాజా ఇన్స్టా పోస్టు చూస్తుంటే పునర్నవి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం ఇన్స్టాగ్రామ్లో తన ఫొటో షేర్ చేస్తూ.. ‘చివరకు.. ఇది జరుగుతుంది’ అనే క్యాప్షన్తో ఆమె ఓ పోస్ట్ పెట్టింంది. ఈ ఫొటోలో పునర్నవి ఎదురుగా ఉన్న వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. అంతేగాక తన ఉంగరం వేలుకు డైమండ్ రింగ్ను ఆమె ధరించి ఉంది. దీంతో పున్నూ నిశ్చితార్థం అయిపోయిందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం పునర్నవి ఎంగేజ్మెంట్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. పవన్ సాదినేని దర్శకత్వంలో చేస్తున్న తన కొత్త వెబ్ షో ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఈ ఫొటో షేర్ చేశారా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, ఇటీవల సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే మాదిరిగా ప్రమోషన్ చేశారు. తమకు పెళ్లి ఫిక్స్ అయినట్టు భ్రమ కలిగించి..కొత్త సినిమాల అప్డేట్స్ చెప్పుకొచ్చారు. అయితే, పున్నూ ఈ విషయంపై అక్టోబర్ 30 న క్లారిటీ ఇస్తానని చెప్పింది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read :
హెలికాఫ్టర్లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు
అప్పట్లో పెళ్లి చేసుకుంటే దేవుడికి కూడా కట్నం ఇచ్చేవారట !