Nayantara: పెళ్లి పనులు ప్రారంభించిన నయన్.. విగ్నేష్.. కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు..

తంజావూర్ లోని పాపనాశం గ్రామంలో నయనతార తనకు కాబోయే భర్త దర్శకుడు విగ్నేష్ శివన్ సొంత గ్రామంలో కులదైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..

Nayantara: పెళ్లి పనులు ప్రారంభించిన నయన్.. విగ్నేష్.. కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు..
Nayan

Edited By:

Updated on: Jun 08, 2022 | 12:05 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇటీవలే ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లితో ఒక్కటయిన సంగతి తెలిసిందే. ఇక వారి బాటలోనే లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ సైతం త్వరలోనే ఒకటవ్వబోతున్నారు (Nayantara).. ఇప్పటికే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని ఓ షోలో పాల్గోన్న నయన్ తన ఉంగరం చూపిస్తూ పరోక్షంగా చెప్పింది. ఇప్పుడు వీరిద్దరు తిరుమలలో పెళ్లి చేసుకోబోతున్నారు.. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లి చేసుకోబోయే కళ్యాణ మండపాన్ని కూడా పరిశీలించినట్లుగా తెలుస్తోంది. వచ్చే నెలలో వీరిద్దరి వివాహం జరగబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నయన్, విఘ్నేష్ తమ పెళ్లి పనులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది… వారి కులదైవం ఆలయంలో ఈ జంట ప్రత్యేక పూజలు నిర్వహించారు..

తంజావూర్ లోని పాపనాశం గ్రామంలో నయనతార తనకు కాబోయే భర్త దర్శకుడు విగ్నేష్ శివన్ సొంత గ్రామంలో కులదైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. పాపనాశంలోని మేలమరుతరు గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లిన నయనతార, విజ్ఞేశ్ శివన్ అమ్మవారికి పొంగలి పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. తమ గ్రామానికి సినీ నటి నయనతార రావడంతో ఆలయానికి అభిమానులు భారీగా చేరుకున్నారు.. జూన్ లేదా ఆగస్టు నెలలో ఇరువురికి పెళ్ళిచేయాలని కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇటీవల విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయన్, సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో కాతు వాకుల రెండు కాదల్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us