
ఫిదా సినిమాతో కుర్ర కారును ఫిదా చేసింది అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి.

ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.

సాయి పల్లవి గత ఏడాది చివర్లో నాగ చైతన్య తో కలిసి నటించిన లవ్ స్టోరీ ,నాని శ్యామ్ సింగ రాయ్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఈముద్దుగుమ్మకు మంచి స్టార్ డమ్ దక్కింది.

దాదాపుగా అయిదు ఆరు నెలలుగా సాయి పల్లవి షూటింగ్ లుకు దూరంగా ఉంటుంది.

ఆమె నటించిన విరాట పర్వం సినిమా ఒక్కటే విడుదలకు సిద్దంగా ఉంది. మరే సినిమా లో కూడా ఆమె నటించడం లేదు..