నటి ఇంట్లో నర్సు చేతివాటం.. బంగారం చోరీ

| Edited By:

Sep 05, 2020 | 12:18 PM

ఓ సినీ నటి ఇంట్లో పనిచేస్తోన్న నర్సు చేతివాటం చూపింది. ఆమె ఇంట్లో బంగారంను చోరీ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు

నటి ఇంట్లో నర్సు చేతివాటం.. బంగారం చోరీ
Follow us on

Actress Gayathri Sainath: ఓ సినీ నటి ఇంట్లో పనిచేస్తోన్న నర్సు చేతివాటం చూపింది. ఆమె ఇంట్లో బంగారంను చోరీ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ నర్సును ఆరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని రాయపేట లయిడ్స్ రోడ్డు వీధిలో నటి గాయత్రి సాయినాథ్‌, తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. తల్లి వృద్ధురాలు కావడంతో ఆమెకు సపర్యలు చేసేందుకు కబాలితోటకు చెందిన ఓ నర్సును ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ఇంట్లో 111 గ్రాముల బంగారం చోరీకి గురైంది. దీంతో గాయత్రి సాయినాథ్‌ రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసును దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ చార్లెస్ నేతృత్వంలోని బృందం.. ఆ బంగారాన్ని దొంగతనం చేసింది నర్సు అని నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మరోవైపు దొంగలించిన బంగారాన్ని ఆ నర్సు తాకట్టు పెట్టినట్టు తెలుసుకున్న పోలీసులు..  ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకొని, గాయత్రి సాయినాథ్‌కు అందజేశారు.

Read More:

యూపీఎస్సీ పరీక్షలు రాసే వారి కోసం ప్రత్యేక రైలు

నాసిక్‌ ప్రాంతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత