
బిగ్ బాస్ రియాలిటీ షోలు బుల్లితెర ప్రేక్షకులకు బాగానే ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నాయి. అదే సమయంలో వివాదాలు కూడా ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ కన్నడ షో ఈసారి వరుస వివాదాల్లో ఎదుర్కొంటోంది. షో వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందంటూ ఆ మధ్యన కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) బిగ్ బాస్ నిర్వాహకులను నోటీసులు జారీ చేసింది. వెంటనే రియాలిటీ షో ను నిలిపివేయాలంటూ ఆదేశాలిచ్చింది. అయితే ఎలాగోలా ఈ వివాదం సమసిపోయింది. అయితే ఇప్పుడు ఈ రియాటీషో మరో వివాదంలో చిక్కుకుంది. ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 12’ పోటీదారు గిల్లిపై ప్రముఖ ఆర్టిస్ట్
హెచ్.సి. కుషాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుషాల దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, మహిళా కమిషన్ బెంగళూరు పోలీస్ కమిషనర్కు లేఖ రాసింది. దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
గిల్లి నట బిగ్ బాస్ ఇంట్లో అమ్మాయిలను వేధిస్తున్నారని ఆర్టిస్ట్ కుషాల ఆరోపించారు. అందుకే ఆమె మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా మహిళా కమిషన్ పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ లేఖ రాశారు. తన ఫిర్యాదు గురించి మీడియాకు వివరించారు కుషాల. గిల్లి అమ్మాయిలను హింసించడానికి బిగ్ బాస్ షోకు వచ్చాడని ఆమె ఆరోపించారు.
‘గిల్లి ఒక కమెడియన్. కానీ అతనికి కామెడీ అంటే ఏమిటో తెలియదు? అతను చేసే పనికి మీరు నవ్వితే, మీరు కొంచెం రిలాక్స్ అవ్వాలి. కానీ బిగ్ బాస్ షోలో అలా కాదు. అమ్మాయిలను హింసించడానికి గిల్లి బిగ్ బాస్ షోకు వచ్చాడు. ఇందుకోసమే అతనికి లక్షలు తీసుకుని మరీ రియాలిటీ షోకు రప్పించారు’ అని కుషాల ఆరోపించారు. ఇది గిల్లి గురించి మాత్రమే కాదు. అమ్మాయిలను ఎగతాళి చేయడానికి ఈ రియాలిటీ షో ఉన్నట్లుంది. అశ్విని గౌడ మాట్లాడటం చూస్తే అమ్మాయిలకు స్ఫూర్తి దాయకంగా ఉంది. కానీ గిల్లి ఏ సందేశం ఇస్తున్నారు? అతనిని ఎందుకు హౌస్ లోకి తీసుకున్నారు?’ అని కుశల ప్రశ్నించారు.
‘ఇలా జరిగిన ప్రతిసారీ సుదీప్ క్షమాపణలు చెబుతాడు. బయట చాలా ఇబ్బంది పడే అశ్విని గౌడ బిగ్ బాస్ హౌస్లో ఎందుకు కూర్చుంటుందో తెలుసా? అశ్వినికి బిగ్ బాస్ షో పట్ల, హోస్ట్ సుదీప్ పట్ల చాలా గౌరవం ఉంది. లేకపోతే ఆమెకు బిగ్ బాస్ షో నుంచి ఎప్పుడో బయటకు వచ్చేది’ అని కుశల ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.