ఆదివారం ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్(34) అంత్యక్రియలు ముంబయిలోని విలే పార్లే శ్మశానవాటికలో ముగిశాయి. ఈ సందర్బంగా బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఆయనకు చివరిసారిగా నివాళులు అర్పించారు. ముంబయిలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, తమ ఆత్మీయుడి చివరి చూపు కోసం కొందరు వెళ్లారు. మరి కొందరు ఆసుపత్రికి వెళ్లి నివాళులు అర్పించారు. వారిలో సుశాంత్ ప్రస్తుత లవర్గా చెప్తున్న రియా చక్రవర్తి, శ్రద్ధా కపూర్, వరుణ్ శర్మ, రాజ్ కుమార్ రావు, నటుడు రణ్వీర్ సోరేయ్, వివేక్ ఒబెరాయ్, నిర్మాత దినేష్ విజన్, దర్శకుడు దిల్ బేచారా దర్వకుడు ముఖేష్ చాబ్రా, కేదార్నాథ్ దర్శకుడు అభిషేక్ కపూర్, ఆయన భార్య ప్రగ్యా, నిర్మాత జాకీ భాగ్నానీ ఉన్నారు. వీరితో పాటు సుశాంత్ మాజీ లవర్ కృతి సనన్ కూడా ఆసుపత్రికి వెళ్లి నివాళులు అర్పించారు.
Read This Story Also: ఒకే రోజు.. ఒకే ఆసుపత్రిలో.. 32 మంది వైద్య సిబ్బందికి కరోనా
. Bollywood celebs at the last rites of #SushantSinghRajput! ?#RIPSushantSinghRajput #ShraddhaKapoor #VivekOberoi #RajkummarRao #VarunSharma #Koimoi pic.twitter.com/JYGg7n7SiM
— Koimoi.com (@Koimoi) June 15, 2020
https://twitter.com/Chiranshu22/status/1272506079105044480