కీర్తిని వద్దనుకుంటోన్న మహేష్‌ టీమ్‌.. కారణమిదేనా..!

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా పరశురామ్ 'సర్కారు వారి పాట'ను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న

కీర్తిని వద్దనుకుంటోన్న మహేష్‌ టీమ్‌.. కారణమిదేనా..!
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2020 | 5:49 PM

Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా పరశురామ్ ‘సర్కారు వారి పాట’ను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మహేష్‌ బాబు, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లేందుకు టీమ్ రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించిన ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో కీర్తిని మహేష్‌ టీమ్ వద్దనుకుంటున్నట్లు సమాచారం.

ఈ మూవీని ప్రకటించి దాదాపుగా రెండు నెలలు అవుతుండగా.. నటీనటుల్లో మహేష్ మినహా మిగిలిన వారి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మహేష్‌ సర్కారు వారి పాటలో తాను నటిస్తున్నట్లు కీర్తి సురేష్‌ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడు కీర్తిని మహేష్‌ టీమ్‌ వద్దనుకుంటున్నట్లు తెలుస్తోంది. కెరీర్ ప్రారంభంలో బాగా బొద్దుగా ఉన్న కీర్తి, ఇప్పుడు బాగా సన్నబడింది. దీంతో ఆమె మొహంలోనూ కల తప్పింది.

ఇక ఇటీవల విడుదలైన రంగ్‌దే టీజర్‌లో ఆమె లుక్‌ పెద్దగా బాలేదంటూ కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె స్థానంలో మరొకరిని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో కీర్తి సురేష్‌ నటించబోతున్నట్లు టీమ్ ఇప్పటివరకు‌ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోగా.. ఆమెను మార్చే ఆలోచనలోనే ఉన్నట్లు సమాచారం. అయితే కీర్తికి మంచి క్రేజ్ ఉండగా.. ఆమెను వదులుకునేందుకు మహేష్ టీమ్ ఎందుకు ప్రయత్నిస్తుందని కొంతమంది అంటున్నారు. మరి ఇందులో నిజమెంత..? నిజంగానే కీర్తిని మహేష్‌ టీమ్ వద్దనుకుంటుందా..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read More:

‘ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌’లో భారీ స్కాం‌.. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: హరి ప్రసాద్

Bigg Boss 4: గంగవ్వ అభ్యర్థన.. డైలమాలో అభిమానులు