ఐదు భాషల్లో ఆర్జీవీ ‘మ‌ర్డ‌ర్’

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం మర్డర్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు.

ఐదు భాషల్లో ఆర్జీవీ మ‌ర్డ‌ర్

Updated on: Jul 23, 2020 | 6:50 PM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం మర్డర్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ నెల 28న ఉదయం గం.9.08ని.లకు మర్డర్‌ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్లు ఆయన వివరించారు. కాగా మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని, వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నామని ఆర్జీవీ తెలిపారు. తెలుగు, త‌మిళం‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాషల్లో మర్డర్ విడుదల కాబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా మర్డర్ చిత్రాన్ని వర్మ ప్రకటించిన తరువాత ఆయనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us