మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇందులో చిరు, చెర్రీ గురు శిష్యుల పాత్రల్లో నటిస్తుండగా.. చెర్రీ దాదాపు 30 నిమిషాలకు పైగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో చెర్రీ పాత్ర కోసం కొరటాల కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇదివరకే ఈ పాత్ర కోసం డైలాగ్లు రాసి పెట్టుకున్నప్పటికీ.. ఇప్పుడు మారుస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని సన్నివేశాలతో పాటు డైలాగ్లను కొరటాల మారుస్తున్నారట. సినిమా రిలీజ్ అయ్యాక చెర్రీ సన్నివేశాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని కొరటాల భావిస్తున్నారట. కొరటాల మాత్రమే కాదు ఈ లాక్డౌన్ సమయంలో పలువురు దర్శకులు తమ సినిమా స్క్రిప్ట్లను మార్చే పనిలో పడ్డారట. ఈ లిస్ట్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తదితరులు ఉన్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పుడు మార్పులు చేయడం కంటే.. ఇప్పుడే చేయడం వలన సమయం కలిసొచ్చే అవకాశం ఉందని వారు అనుకుంటున్నారట. కాగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ఈ నెల 17తో ముగియనుంది. ఈ క్రమంలో జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారం నుంచి షూటింగ్లు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.
Read This Story Also: ఎన్టీఆర్ రూల్.. ‘పాన్ ఇండియా’ కాదు ‘కంటెంట్’ ముఖ్యం..!