చెర్రీ పాత్రలో మార్పులు చేస్తోన్న కొరటాల..!

| Edited By:

May 11, 2020 | 3:58 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'ఆచార్య'లో రామ్‌ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

చెర్రీ పాత్రలో మార్పులు చేస్తోన్న కొరటాల..!
Follow us on

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో రామ్‌ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇందులో చిరు, చెర్రీ గురు శిష్యుల పాత్రల్లో నటిస్తుండగా.. చెర్రీ దాదాపు 30 నిమిషాలకు పైగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో చెర్రీ పాత్ర కోసం కొరటాల కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇదివరకే ఈ పాత్ర కోసం డైలాగ్‌లు రాసి పెట్టుకున్నప్పటికీ.. ఇప్పుడు మారుస్తున్నట్లు తెలుస్తోంది.

కొన్ని సన్నివేశాలతో పాటు డైలాగ్‌లను కొరటాల మారుస్తున్నారట. సినిమా రిలీజ్ అయ్యాక చెర్రీ సన్నివేశాలు సెన్సేషన్‌ క్రియేట్ చేస్తాయని కొరటాల భావిస్తున్నారట. కొరటాల మాత్రమే కాదు ఈ లాక్‌డౌన్‌ సమయంలో పలువురు దర్శకులు తమ సినిమా స్క్రిప్ట్‌లను మార్చే పనిలో పడ్డారట. ఈ లిస్ట్‌లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్‌ తదితరులు ఉన్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పుడు మార్పులు చేయడం కంటే.. ఇప్పుడే చేయడం వలన సమయం కలిసొచ్చే అవకాశం ఉందని వారు అనుకుంటున్నారట. కాగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 17తో ముగియనుంది. ఈ క్రమంలో జూన్‌ చివరి వారం లేదా జూలై మొదటి వారం నుంచి షూటింగ్‌లు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

Read This Story Also: ఎన్టీఆర్‌ రూల్.. ‘పాన్‌ ఇండియా’ కాదు ‘కంటెంట్‌’ ముఖ్యం..!