మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న రిలీజైన ఈ చిత్రం అన్ని చోట్లా మంచి విజయాన్ని అందుకుంది. అయితే మహేష్ కెరీర్లో అందని ద్రాక్షగా ఉన్న 25 కోట్ల మార్క్ను మహర్షి చిత్రం చేరుకుంది. గత ఐదేళ్లో మహేశ్ నటించిన ఏ సినిమా కూడా ఈ స్థాయి వసూళ్లను సాధించలేదు. ఈ సినిమాలో రైతుల సమస్యలను, వాటికి పరిష్కారాలను చక్కగా చూపించారు. ఇదే సినిమాకు ప్లస్ అయింది. అంతేకాదు, మహేష్ బాబు సినిమా ప్రచారంలో భాగస్వామ్యం కావడంతో అభిమానుల్లో మరింత జోష్ ను పెంచింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ల మధ్య మరిన్ని సీన్స్ సినిమాలో యాడ్ చేయబోతున్నారట. వీటిని యాడ్ చేస్తే నిడివి మరింత పెరగనుంది. ఇప్పటికే సినిమా రన్ టైమ్ మూడు గంటల వరకు ఉంది. మరి ఈ సీన్స్ యాడ్ చేసి నిడివి మరింత పెంచితే ప్రేక్షకులు ఆస్వాదిస్తారో లేదో చూడాలి.