సంచలనం.. అత్యాచారం కేసులో హీరోయిన్ అరెస్ట్.. బాలికను హోటల్‌కు తీసుకెళ్లి..

ఆమెకు 16 ఏళ్లు.. సినిమాల్లో నటించడం అంటే ఇష్టం.. అది వాళ్లకు సాకుగా మారింది.. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ నమ్మబలికారు.. దీంతో వారి మాయమాటలకు ఆ బాలిక పడిపోయింది.. సినిమాల్లో ఎలాగైనా నటించాలని.. చివరకు వాళ్ల దగ్గరకు వెళ్లింది.. అలా వెళ్లిన ఆమెపై హీరోయిన్ సమక్షంలో.. నలుగురు అఘాాయిత్యానికి పాల్పడ్డారు..

సంచలనం.. అత్యాచారం కేసులో హీరోయిన్ అరెస్ట్.. బాలికను హోటల్‌కు తీసుకెళ్లి..
Minu Muneer

Updated on: Aug 15, 2025 | 11:24 AM

ఆమెకు 16 ఏళ్లు.. సినిమాల్లో నటించడం అంటే ఇష్టం.. అది వాళ్లకు సాకుగా మారింది.. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ నమ్మబలికారు.. దీంతో వారి మాయమాటలకు ఆ బాలిక పడిపోయింది.. సినిమాల్లో ఎలాగైనా నటించాలని.. చివరకు వాళ్ల దగ్గరకు వెళ్లింది.. అలా వెళ్లిన ఆమెపై హీరోయిన్ సమక్షంలో.. నలుగురు అఘాాయిత్యానికి పాల్పడ్డారు.. ఇది జరిగిన పదేళ్ల తర్వాత ఆ యువతి.. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులతో చెప్పి.. పోలీసులను ఆశ్రయించింది.. ఇంతకాలం భయంతో గడిపిన ఆ యువతి.. తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికపై అత్యాచారం కేసులో ఓ హీరోయిన్ ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 16 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారని.. ఈ కేసులో మలయాళ సినీ నటి మిను మునీర్‌ (51) ను పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పదేళ్ల క్రితం మిను మునీర్‌ సినిమాల్లో నటించేలా చేస్తానని చెప్పి తన బంధువు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికను చెన్నై తీసుకొచ్చింది.. ఆ తర్వాత ఓ ప్రైవేటు హోటల్‌లో ఆ బాలికను ఉంచింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పదేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చెన్నై తిరుమంగళం ఆల్‌ ఉమెన్‌ పోలీసులు నటి మిను మునీర్‌ను గురువారం అరెస్టు చేశారు.. అనంతరం చెన్నైకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ యువతికి 26 ఏళ్లని.. ఆ బాలిక గత సంవత్సరం కేరళలో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. తరువాత, ఆ ఫిర్యాదు చెన్నైలోని పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు వెల్లడించారు. 2014లో పాఠశాల సెలవుల్లో, తన కుమార్తెను తన దూరపు బంధువు మినుతో కలిసి సినిమాలో పాత్ర కోసం చెన్నైకి పంపిందని బాధితురాలి తల్లి ఆరోపించింది.

ఆమె ఆ అమ్మాయిని అన్నా నగర్‌లోని ఒక హోటల్‌కు తీసుకెళ్లి, ఆమెను నలుగురు వ్యక్తులకు పరిచయం చేసి, సినిమా అవకాశాల గురించి చర్చించింది. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించింది. ఆ తర్వాత హోటల్ నుండి వెళ్లిపోయిందని.. కానీ భయం కారణంగా ఈ సంఘటన గురించి నివేదించలేదని తెలిపారు. అయితే.. అత్యాచారం కేసులో హీరోయిన్ పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

కేరళలోని ఎర్నాకులంకు చెందిన మిను మునీర్ అలియాస్ మిను కురియన్.. 2008 నుండి 2018 వరకు వివిధ మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో, కొన్ని టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..