ట్రైన్‌లో మహేష్.. కామెడీ స్టార్ట్

| Edited By:

Aug 03, 2019 | 12:33 PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ట్రైన్‌లో నిల్చున్న మహేష్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నిర్మాత అనిల్ సుంకర. దానికి ‘‘సంక్రాంతి రేసులో నవ్వించేందుకు నవ్వుల ఎక్స్‌ప్రెస్ కదులుతోంది. నవ్వుల కెప్టెన్ అనిల్ రావిపూడితో కలిసి మన సూపర్‌స్టార్ మిమ్మల్ని అలరించేదుకు సిద్ధమవుతున్నాడు. 2020 సంక్రాంతికి సిద్ధంగా ఉండండి’’ అని […]

ట్రైన్‌లో మహేష్.. కామెడీ స్టార్ట్
Follow us on

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ట్రైన్‌లో నిల్చున్న మహేష్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నిర్మాత అనిల్ సుంకర.

దానికి ‘‘సంక్రాంతి రేసులో నవ్వించేందుకు నవ్వుల ఎక్స్‌ప్రెస్ కదులుతోంది. నవ్వుల కెప్టెన్ అనిల్ రావిపూడితో కలిసి మన సూపర్‌స్టార్ మిమ్మల్ని అలరించేదుకు సిద్ధమవుతున్నాడు. 2020 సంక్రాంతికి సిద్ధంగా ఉండండి’’ అని కామెంట్ పెట్టాడు.

కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన సరసన రష్మిక నటిస్తుండగా.. విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు. మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.