చిరు మూవీపై స్పందించిన కాజల్.. ఏమన్నారంటే..!
చిరంజీవి హీరోగా కొరటాల తెరకెక్కిస్తోన్న ఆచార్య మూవీ నుంచి త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
చిరంజీవి హీరోగా కొరటాల తెరకెక్కిస్తోన్న ఆచార్య మూవీ నుంచి త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక ఆ స్థానంలో కాజల్ ఓకే అయినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరు రీ ఎంట్రీ చిత్రమైన ఖైదీ నంబర్.150లో మెగాస్టార్ సరసన నటించిన కాజల్.. ఆయనతో మరోసారి రొమాన్స్ చేయబోతున్నట్లు పుకార్లు వినిపించాయి. ఇక ఇదే విషయంపై కాజల్ను సంప్రదించగా.. వాటిపై చందమామ క్లారిటీ ఇచ్చింది.
తాను చిరంజీవి- కొరటాల ప్రాజెక్ట్లో నటించబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్కు ఇప్పుడు బ్రేక్ పడగా.. ఆ తరువాత ప్రారంభమయ్యే షూటింగ్లో కాజల్ కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటించనున్నారు. ఆయన సరసన రష్మిక కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సోనూసూద్ మరో కీలక పాత్రలో నటించనుండగా..రెజీనా ప్రత్యేక పాత్రలో మెరవనుంది. అక్టోబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాగా సోషియల్ మెసేజ్తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Read This Story Also: కరోనా ఎఫెక్ట్.. సినీ కార్మికులకు ‘నెట్ఫ్లిక్స్’ భారీ విరాళం..!