నువ్వు నిజంగా ఓ ప్రత్యేకమైన వ్యక్తివి: సుశాంత్‌కి శ్రద్ధా అక్షర నివాళి

| Edited By:

Jun 19, 2020 | 6:05 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఐదు రోజులు గడుస్తున్నా.. ఆయన ఙ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నారు సన్నిహితులు, అభిమానులు.

నువ్వు నిజంగా ఓ ప్రత్యేకమైన వ్యక్తివి: సుశాంత్‌కి శ్రద్ధా అక్షర నివాళి
Follow us on

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఐదు రోజులు గడుస్తున్నా.. ఆయన ఙ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నారు సన్నిహితులు, అభిమానులు. ఈ క్రమంలో ఇప్పటికే సుశాంత్ అంత్యక్రియలకు వెళ్లి నివాళులు అర్పించిన నటి శ్రద్దా కపూర్.. తాజాగా సోషల్ మీడియాలో ఆయన ఙ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు సుశాంత్ ఇచ్చిన పుస్తకాన్ని, సుశాంత్‌తో తీసుకున్న ఫొటోను ఆమె షేర్ చేశారు.

”జరిగిన విషయాన్ని అంగీకరించాలి అనుకున్నా.. వాస్తవంలో చాలా ఇబ్బందిగా ఉంది. చాలా శూన్యంగా ఉంది సుశాంత్. డియర్ సుశ్‌.. అపారమైన మానవత్వం, తెలివి కలిగి.. జీవితం గురించి ఎంతో ఉత్సుకత ఉండి.. ప్రతి విషయంలోనూ అందాన్ని ఆస్వాదించేవాడివి. తన సొంత ట్యూన్‌కి అతడు డ్యాన్స్ వేసుకునేవాడు.

”సెట్స్‌లో అతడిని చూసేందుకు నేను ఎప్పుడూ ఎదురుచూసేదాన్ని. అతడితో తరువాత దేని గురించి చర్చించాలి అన్న ఆసక్తి ఉండేది. వీటన్నింటికి మించి అతడొక గొప్ప సహ నటుడు. చేసే పనిలో హృదయం, మనస్సు రెండూ పెడతాడు. చాలా అద్భుతమైన వ్యక్తి. తన దగ్గరున్న వారిని సంతోషపెట్టాలని ఎప్పుడూ పరితపిస్తూ ఉండేవాడు. అతడి నవ్వు, షూటింగ్‌ సమయంలో మా మధ్య జరిగిన మాటలు, చెప్పుకున్న ఫిలాసఫీలు, మేమిద్దరం కలిసి పనిచేసిన క్షణాలు అన్నీ ఓ అద్భుతమైనవి. అతడికి సంగీతం అన్నా, కవితలు అన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఒకరోజు అతడి ఇంటికి తీసుకెళ్లింది. అప్పుడు అతడి టెలిస్కోప్‌ నుంచి నాకు చందమామను చూపించాడు. అంత దగ్గరగా నేను చంద్రుడిని ఎప్పుడూ చూడకపోగా.. ఆ అద్భుతాన్ని చూశాక నాకు మాట రాలేదు. ఆ గొప్ప అనుభూతిని అతడు నాతో పంచుకోవాలనుకున్నాడు. పవ్నాలో ఉన్న అతడి ఇంటికి ‘చిచ్చోరే’ టీమ్‌ మొత్తం ఒకసారి వెళ్లాము. అక్కడ ఉన్న ప్రశాంతతను చూసి చాలా సంతోషాన్ని పొందాము. ప్రకృతి అంటే అతడికి చాలా ఇష్టం. కెలైడోస్కోపిక్‌ లెన్స్‌ ద్వారా అంతరిక్షాన్ని చూసే అతడు.. దాన్ని తన చుట్టూ ఉన్న వారికి చూపించాలనుకుంటాడు. చిన్న చిన్న వాటికే చాలా సంతోషపడిపోతుంటాడు. అతడు నిజంగా ఓ ప్రత్యేకమైన వ్యక్తి. నిన్ను మిస్ అవుతాను సుశ్‌. ఎప్పుడూ ప్రకాశిస్తుండు” అని శ్రద్ధా అక్షర నివాళిని అర్పించారు.

Read This Story Also: పీపీఈ కిట్ ధరించి.. ఓటేసి వెళ్లిన కరోనా సోకిన ఎమ్మెల్యే