Ramayan: చిక్కుల్లో నితీష్ తివారీ రామాయణం.. సాయిపల్లవి, రణబీర్ సినిమాకు లీగల్ సమస్యలు..
సీనియర్ హీరో సన్నీ డియోల్ ఆంజనేయుడు పాత్రలో.. లారా దత్త, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాగాలుగా రూపొందించనున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మరోవైపు ఈ సినిమాను లీక్స్ సమస్య వేధిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఫోటోస్ లీక్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.
మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో రామాయణం ఒకటి. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే బజ్ నెలకొంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. అలాగే సీనియర్ హీరో సన్నీ డియోల్ ఆంజనేయుడు పాత్రలో.. లారా దత్త, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాగాలుగా రూపొందించనున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మరోవైపు ఈ సినిమాను లీక్స్ సమస్య వేధిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఫోటోస్ లీక్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.
ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. ఈ సినిమాను ముందుగా బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించాలనుకున్నారు. కారణాలు తెలియదు కానీ ఇటీవలే ఈ సినిమా నిర్మాణం నుంచి వీరు తప్పుకున్నారు. ఇఖ ఇప్పుడు మంతెన మీడియా వెంచర్స్ ఎల్ఎల్సీ పబ్లిక్ నోటీసులు జారీ చేసింది. ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఏప్రిల్ 2024లో తమ క్లయింట్ అియన అల్లు మంతెనా మీడియో వెంచర్స్ ఎల్ఎల్పీ కుదుర్చుకున్న అసైన్మెంట్ ఒప్పందానికి అనుగుణంగా రామాయణం మేధో సంపత్తి హక్కులను పొందేందుకు చర్యలు ప్రారంభించిందని.. కానీ చెల్లింపు నిబంధనలను ఇంకా నెరవేర్చలేదని సదరు కథనం పేర్కొంది. ఫ్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రాజెక్ట్ రామాయణంలోని ఏదైన కంటెంట్ ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘనగా పరిగణించాల్సి వస్తుందని.. అందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంతెనా మీడియా వెంచర్స్ ప్రకటించినట్లు సదరు కథనం పేర్కొంది.
ఈ అసైన్మెంట్ అగ్రిమెంట్ కింద్ అసైన్మెంట్ అమలులోకి రావడానికి ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా ఒప్పందం చెల్లించాల్సిన చెల్లింపులు ఏవి అందలేదని.. దీంతో ప్రాజెక్ట్ రామాయణంలోని హక్కులు తమకే చెందుతాయని వెల్లడించింది. ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ కు సినిమా తీసే హక్కు లేదని పేర్కోంది. స్క్రిప్ట్ లేదా మెటీరియల్ ఉఫయోగం అంటే దోపిడీగా పరిగణించాల్సి వ్సతుందని.. ఈ మూవీలో పనిచేసేవారంతా కాపీరైట్ ఉల్లంఘన పరిధిలోకి వస్తారని మంతెనా మీడియా పేర్కొంది. ఇక ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.