‘బాహుబలి’ టీమ్ రీ యూనియన్.. మిలియన్ డాలర్ల ఫొటో
తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఇటీవల అరుదైన గౌరవం లభించింది. ఈ మూవీని లండన్లో ప్రతిష్టాత్మక ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించినున్నారు. ఈ ప్రదర్శనకు బాహుబలి టీం హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రభాస్, అనుష్క, రానాలతో ఓ ఫొటోను తీసుకొన్న రాజమౌళి.. దాన్ని సోషల్ మీడియాలో […]
తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఇటీవల అరుదైన గౌరవం లభించింది. ఈ మూవీని లండన్లో ప్రతిష్టాత్మక ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించినున్నారు. ఈ ప్రదర్శనకు బాహుబలి టీం హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రభాస్, అనుష్క, రానాలతో ఓ ఫొటోను తీసుకొన్న రాజమౌళి.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
The #RoyalReunion for all of us in London!!
Excited for tomorrow’s unique rendition of #Baahubali background score at the @RoyalAlbertHall..:) pic.twitter.com/yHPxmtvWCq
— rajamouli ss (@ssrajamouli) October 18, 2019
8మా అందరికీ లండన్లో ఇది రాయల్ రీ యూనియన్. బాహుబలి షో కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. రాయల్ ఆల్బర్ట్ హాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లే అవ్వనుంది’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ ప్రదర్శనలో సంగీత దర్శకుడు కీరవాణి లైవ్లో నేపథ్య సంగీతాన్ని వినిపించనున్నారు. ఇక ఈ వేదికపై బాహుబలితో పాటు హాలీవుడ్ సినిమాలు హ్యారీ పోటర్, బాండ్ మూవీ స్కై ఫాల్లు కూడా ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫొటోకు నెటిజన్లు ‘మిలియన్ డాలర్ల ఫొటో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.