గతేడాది 15న లదాక్లోని గాల్వన్ వ్యాలీ వద్ద భారత సైన్యంపై చైనా ఆర్మీ జరిపిన దాడిలో 20 మంది భారతీయ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చైనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చైనా, మనదేశంలో పెడుతున్న పెట్టుబడుల నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. అలాగే ఆ దేశానికి చెందిన 59 యాప్లను బ్యాన్ చేసింది. ఇక ఇప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే గల్వాన్ వ్యాలీ ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ వెల్లడించారు. అంతేకాదు ఈ మూవీ కోసం ఇప్పటికే నటీనటులను ఎంచుకున్నట్లు అజయ్ తెలిపారు. ఇక ఈ మూవీని అజయ్ దేవగన్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హైల్డింగ్ ఎల్ఎల్పీలు సంయుక్తంగా నిర్మించనున్నారు. అయితే ఇందులో అజయ్ నటిస్తారా..? లేదా నిర్మాతగానే పరిమితం అవుతారా..? అన్నది తెలియాల్సి ఉంది.
IT'S OFFICIAL… #AjayDevgn to make film on #GalwanValley clash… The film – not titled yet – will narrate the story of sacrifice of 20 #Indian army men, who fought the #Chinese army… Cast not finalized… Ajay Devgn FFilms and Select Media Holdings LLP will produce the film. pic.twitter.com/yaM6rPcK7Z
— taran adarsh (@taran_adarsh) July 4, 2020