హుజూర్ నగర్ అభ్యర్థులకు ఈసీ షాక్ !

పార్టీల హడావిడితో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న  అభ్యర్థులకు షాకిచ్చే డెసిషన్ తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. అంతేకాదు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బిజెపిలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు హుజూర్ నగర్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా పావులు […]

హుజూర్ నగర్ అభ్యర్థులకు ఈసీ షాక్ !
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 04, 2019 | 6:47 PM

పార్టీల హడావిడితో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న  అభ్యర్థులకు షాకిచ్చే డెసిషన్ తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. అంతేకాదు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బిజెపిలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు హుజూర్ నగర్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. విజయమే పరమావధిగా డబ్బులు కుమ్మరిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరందుకున్నాయి. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ గురువారం న్యూఢిల్లీ వెళ్ళి మరీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వచ్చారు. దీని సారాంశమేంటంటే.. తెలంగాణలో అధికారంలో వున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అభియోగం.

లక్ష్మణ్ తోపాటు పలువురు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన దరిమిలా సిఈసీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎన్నికల వ్యయ పరిశీలకున్ని నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 1983 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి బిఆర్ బాలకృష్ణన్ ను కేంద్ర ఎన్నికల సంఘం వ్యయపరిశీలకునిగా నియమించింది. అంతేకాదు ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు  సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేసింది. ఆయన స్థానంలో భాస్కరన్‌ను నియమించింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని, సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేయాలంటూ తెలంగాణ జనసమితి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఈసీ సూర్యాపేట ఎస్పీని బదిలీ చేసింది.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..