నేడు సీఎం జగన్ని కలవనున్న దివ్య తల్లిదండ్రులు
విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఇవాళ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు
Divya Tejaswini Parents: విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఇవాళ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు వారు జగన్ని కలవనున్నారు. అయితే ప్రేమ పేరుతో బీటెక్ విద్యార్థిని దివ్యను గణేష్ బాబు దారుణంగా హత్య చేశారు. దివ్య నిద్రిస్తుండగా.. ఆమె ఇంటికెళ్లి కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత తనపై దాడి చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. ఇక ఘటన తరువాత దేజస్విని తల్లిదండ్రులను హోంమంత్రి కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ను కలిసే అవకాశం ఇవ్వాలని వారు సుచరితను కోరారు. ఈ నేపథ్యంలో సుచరిత ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లు చేశారు.
Read More:
ఆ నటుడితో రాశి రెండోసారి రొమాన్స్..!