Breaking: భాస్కరరావు హత్య.. టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు

| Edited By:

Jul 03, 2020 | 7:40 AM

మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Breaking: భాస్కరరావు హత్య.. టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు
Follow us on

మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుట్రదారుగా రవీంద్రపై 109 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో శనివారం కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకోనున్న పోలీసులు విచారణ జరపనున్నట్లు సమాచారం.

కాగా గత నెల 29న భాస్కరరావు బందరులో పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటికే కొల్లు రవీంద్ర అనుచరుడు, టీడీపీ నేత చింతా చిన్నితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఆర్‌పేట పోలీసులు,  వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈ క్రమంలో మోకాను హత్య చేస్తే తర్వాత అంతా తాను చూసుకుంటానని కొల్లు రవీంద్ర తమకు అభయం ఇచ్చినట్టు నిందితులు పోలీసుల విచారణ వాంగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు.