కాకినాడలో దారుణం.. భర్తకు బ్లాక్ ఫంగస్.. మనోధైర్యం కోల్పోయిన భర్య ఆత్మహత్య…

కాకినాడ జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నాడు. భర్తతోపాటు ఆమె కూడా అక్కడే ఉంటోంది. అయితే భర్తకు వ్యాధి నయమవుతుందో లేదోనన్న అనుమానంతో ఆందోళనకు గురైంది.

కాకినాడలో దారుణం.. భర్తకు బ్లాక్ ఫంగస్.. మనోధైర్యం కోల్పోయిన భర్య ఆత్మహత్య...
Man Commits Suicide

Updated on: May 27, 2021 | 8:07 AM

కాకినాడలో దారుణం జరిగింది. భర్తకు బ్లాక్ ఫంగస్ సోకింది అని తెలయడంతో భార్య కుదేలైంది. ఆందోళనతో ఏం చేయాలో తెలియని పరిస్థితికి చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ ఘటన చోటు చేసుకుంది.పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన తిరుపారెడ్డి, భార్య బుల్లిమావతికి కొవిడ్ సోకింది. చికిత్స అనంతరం ఇద్దరూ కోలుకున్నారు. ఈ నెల 19 నుంచి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. తిరుపారెడ్డికి బ్లాక్ ఫంగస్ రావడంతో కాకినాడ జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నాడు. భర్తతోపాటు ఆమె కూడా అక్కడే ఉంటోంది. అయితే భర్తకు వ్యాధి నయమవుతుందో లేదోనన్న అనుమానంతో ఆందోళనకు గురైంది.

అంతేకాకుండా మనోధైర్యం  కూడా  కోల్పోయింది.  ఆమె భర్త బ్లాక్ ఫంగస్​తో చికిత్స పొందుతుండటం… ఆయనతో పాటు ఉన్న భార్య బుల్లిమావతి మనస్తాపంతో ఆసుపత్రి గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. మహిళ ఈ ఉదయం ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ అక్కడే ఉన్న కొందరు బాధిత కుటుంబ సభ్యులు చూసి ఆస్పత్రి సిబ్బందికి చెప్పడంతో వారు పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి : కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి 577 మంది అనాథలైన చిన్నారులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి

Etela New Profile Pick: ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చిన ఈటల రాజేందర్‌.. ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద చర్చ..

Covaxin Second Dose: నేటినుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌

Etela Rajender: ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారు..! కేంద్ర నాయకత్వం నుంచి సిగ్నల్ రావడమే ఆలస్యం..

 

Follow Us