తల్లిని పోషించలేక.. హత్య చేసిన కొడుకు, కోడలు

| Edited By:

Aug 20, 2019 | 9:47 AM

రోజురోజుకీ మానవత్వాలు మట్టిలో కలిసిపోతున్నాయి. కసి, పగతో.. వారి జీవితాలతో.. పాటు పక్కవారి జీవితాలను కూడా బలి తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఎంత అవగాహన తీసుకొచ్చినా.. సమాజం తీరు మారట్లేదు. తాజాగా.. హైదరాబాద్‌లోని చంద్రాయాణగుట్టలో ఆలస్యంగా ఓ ఘటన చోటుచేసుకుంది. తల్లిని పెంచలేని ఓ కొడుకు, కోడలు ఆమెను హత్య చేశారు. ఖైరున్నిసా అనే వృద్ధురాలి గొంతునులిమి చంపేశారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని విచారించగా.. అసలు విషయం బయటపెట్టారు. వృద్ధురాలైన […]

తల్లిని పోషించలేక.. హత్య చేసిన కొడుకు, కోడలు
Follow us on

రోజురోజుకీ మానవత్వాలు మట్టిలో కలిసిపోతున్నాయి. కసి, పగతో.. వారి జీవితాలతో.. పాటు పక్కవారి జీవితాలను కూడా బలి తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఎంత అవగాహన తీసుకొచ్చినా.. సమాజం తీరు మారట్లేదు. తాజాగా.. హైదరాబాద్‌లోని చంద్రాయాణగుట్టలో ఆలస్యంగా ఓ ఘటన చోటుచేసుకుంది. తల్లిని పెంచలేని ఓ కొడుకు, కోడలు ఆమెను హత్య చేశారు. ఖైరున్నిసా అనే వృద్ధురాలి గొంతునులిమి చంపేశారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని విచారించగా.. అసలు విషయం బయటపెట్టారు. వృద్ధురాలైన తల్లిని పోషించలేకనే.. ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చారు. నిందితులైన కొడుకు చాంద్ పాషా, భార్య కౌసర్ బేగంను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.