Deadbody in Fridge: ఫ్రిడ్జ్ లో వృద్ధుడి శవం.. అంత్యక్రియలకు డబ్బులు లేక దాచానంటోన్న మనుమడు

|

Aug 12, 2021 | 10:01 PM

వరంగల్ రూరల్ పరకాల సగర వీధిలో ఇవాళ ఒక దారుణం వెలుగుచూసింది. ఫ్రిడ్జ్ లో అత్యంత జుగుప్సాకరంగా ఉన్న బాలయ్య అనే వృదుడి మృత దేహం ఉదంతం బయటకొచ్చింది. అయితే,

Deadbody in Fridge: ఫ్రిడ్జ్ లో వృద్ధుడి శవం.. అంత్యక్రియలకు డబ్బులు లేక దాచానంటోన్న మనుమడు
Parakala Ps
Follow us on

Deadbody in Fridge: వరంగల్ రూరల్ పరకాల సగర వీధిలో ఇవాళ ఒక దారుణం వెలుగుచూసింది. ఫ్రిడ్జ్ లో అత్యంత జుగుప్సాకరంగా ఉన్న బాలయ్య అనే వృదుడి మృత దేహం ఉదంతం బయటకొచ్చింది. అయితే, ఈ విషయంలో మృతుడి మనువడు చెబుతోన్న కారణం చూసి ఆశ్చర్యమేకాదు, జనానికి భయం కూడా మొదలైంది.

అంత్యక్రియలకు డబ్బులు లేక మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లో దాచానని మనుమడు అంటున్నాడు. కాగా, వృద్ధుడు రెండు రోజుల క్రితం మృతి చెందిననట్టు చెప్పుకొస్తున్నాడు. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే, వృద్ధుడ్ని చంపి శవాన్ని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Dead Body In Fridge

ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ ద్వారా యువతితో వీడియో కాల్.. కట్ చేస్తే, ఘోరం !

హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నగర్ బస్తీలో ఇవాళ దారుణం చోటుచేసుకుంది. మాయలేడి బ్లాక్ మెయిలింగ్‌కు నాయక్ అనే 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతితో వీడియో కాల్ మాట్లాడిన అనంతరం.. సదరు లేడీ కిలేడీ అవతారమెత్తింది. వీడియో కాల్ స్క్రీన్ రికార్డింగ్ చేసి తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడం ప్రారంభించింది.

సదరు వీడియో సోషల్ మీడియాలో పెడతానంటూ అబ్బాయిని బెదిరించింది. ఆమె వేధింపులు తట్టుకోలేని సదరు యువకుడు, విషయం బయటకు వస్తే ఎక్కడ పరువుపోతుందోనని తీవ్ర మనోవేదన చెందాడు. చావే శరణ్యమనుకొని ఇవాళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఉదంతం మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకుడు బిటెక్ పూర్తి చేసినట్లు బంధువులు తెలిపారు. ఈ ఆన్లైన్ చాటింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని వారి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Tirumala: శ్రీవారి దర్శన టిక్కెట్లు మార్ఫింగ్ చేసి భక్తులకు విక్రయం.. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూపీలాగడంతో గుట్టురట్టు