పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిపై రైతుల దాడి.. కారు ధ్వంసం

పంజాబ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అశ్వని శర్మపై రైతులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారును ధ్వంసం కాగా, ఆయన మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిపై రైతుల దాడి.. కారు ధ్వంసం

Updated on: Oct 12, 2020 | 10:16 PM

పంజాబ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అశ్వని శర్మపై రైతులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారును ధ్వంసం కాగా, ఆయన మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా హోషియార్‌పూర్ జిల్లాలోని తాండా ప్రాంతంలో సోమవారం రైతుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆ ప్రాంతానికి కారులో వచ్చిన అశ్వని శర్మను గమనించిన ఆందోళన చేస్తున్న కొందరు రైతులు దాడి చేశారు. ఆయన కారుపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. స్థానిక పోలీసులు సకాలంలో స్పందించి జోక్యం చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. అశ్వని కుమార్‌ను పోలీసులు భద్రత మధ్య సమీప పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఈ దాడిని వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలో పలుచోట్ల రాస్తారోకో చేపట్టారు. రాజకీయపార్టీల కుట్రలో భాగంగానే అశ్వని శర్మపై దాడి జరిగిందని బీజేపీనేతలు ఆరోపించారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ రైతులు గత నెల నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us